News November 22, 2024
ముగిసిన ప్రధాని నరేంద్రమోదీ 3 దేశాల పర్యటన

ప్రధాని నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటన ముగిసింది. గయానాలోని జార్జిటౌన్ నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరారు. మొదట ఆయన నైజీరియా వెళ్లారు. అక్కడి నుంచి G20 సమ్మిట్ కోసం బ్రెజిల్ వచ్చారు. సమావేశాలు ముగిశాక ద్వీప దేశమైన గయానాకు చేరుకున్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాలు, రక్షణ సహా పది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అక్కడి భారతీయులను కలిసి ముచ్చటించారు. ఆయా దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకోవడం తెలిసిందే.
Similar News
News December 7, 2025
కోర్ సబ్జెక్ట్ లేదని అనర్హులుగా ప్రకటించలేం: సుప్రీం

అభ్యర్థి PGలో కోర్ సబ్జెక్ట్ లేదని అతడిని అనర్హుడిగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2013లో మానిటరింగ్, ఎవాల్యుయేషన్ కన్సల్టెంట్గా ఓ అభ్యర్థి(M.Com) ఎంపికయ్యారు. కానీ స్టాటిస్టిక్స్లో PG లేదని అతడిని ప్రభుత్వం తొలగించింది. దీంతో బాధితుడు SCని ఆశ్రయించారు. జాబ్కు కావాల్సిన ప్రధాన సబ్జెక్టు అభ్యర్థి చదివాడని, అతడి PG వేరే స్పెషలైజేషన్లో ఉందని తిరస్కరించలేమని SC స్పష్టం చేసింది.
News December 7, 2025
భారీ జీతంతో రైట్స్లో ఉద్యోగాలు..

<
News December 7, 2025
ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతాం: ఇండిగో

ఇండిగో విమానాల సంక్షోభం ఆరో రోజూ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టుల్లో పదుల సంఖ్యలో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్లోనే 100 దాకా రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. అయితే ఆదివారం కావడంతో రద్దీ కాస్త తగ్గినట్లు సమాచారం. మరోవైపు 95 శాతం కనెక్టివిటీని పునరుద్ధరించామని ఇండిగో చెబుతోంది. ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతామని తెలిపింది.


