News January 6, 2025
ప్రైవేట్ బస్సులు దోచుకుంటున్నాయి: విజయసాయి

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయని YCP MP విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రెగ్యులర్ ఛార్జీలపై డబుల్, ట్రిపుల్ వసూలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని కోరారు. మామూలు రోజుల్లో రూ.1500 వరకు ఉండే HYD- వైజాగ్ ప్రైవేట్ బస్సుల AC స్లీపర్ టికెట్కి ప్రస్తుతం రూ.5K, రూ.1200 వరకు ఉండే HYD-TPT టికెట్ రూ.3Kకి పైగా వసూలు చేస్తున్నాయి.
Similar News
News February 25, 2026
పసుపు పంటలో దుంప తొలుచు ఈగ – నివారణ

పసుపు పంట సుడి దగ్గర ఆకులు వాడి, ఎండిపోయి, లాగినప్పుడు మొవ్వు సులభంగా ఊడొచ్చి, దుంప లోపల బియ్యం గింజల్లాంటి పిల్ల పురుగులు కనిపిస్తే అది దుంప తొలుచు ఈగగా గుర్తించాలి. దీని నివారణకు ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్య వేయాలి. సెంటుకు 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలకు అదే పరిమాణం గల ఇసుకతో కలిపి పొలంలో తెగులు ఆశించిన దగ్గర చల్లాలి. అలాగే మొక్కల మధ్య నీరు నిల్వకుండా జాగ్రత్త వహించాలి.
News February 25, 2026
2,551నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

న్యూఢిల్లీలోని <
News February 25, 2026
ఎందుకలా?!: ఇవి జీవితంలో నీళ్లే తాగవు..

‘కంగారూ ఎలుకలు’ తమ జీవిత కాలం(2-5yrs)లో ఒక్కసారి కూడా నీళ్లు తాగవు. వీటి ఆహారమైన గింజలు, విత్తనాల్లోని తేమతో దాహం తీర్చుకుంటాయి. ఆహారం జీర్ణమయ్యే టైమ్లో శరీరంలో ‘మెటబాలిక్ వాటర్’ను తయారు చేసుకుంటాయి. ఒంటెలు, కోలాలు, కొన్ని రకాల కప్పలు నీళ్లు లేకుండా కొన్ని రోజులు/నెలలు బతకగలవు. మనుషులు నీరు తాగకుండా 3-4 రోజులు ఉండగలరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజూ 4pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో.


