News January 6, 2025

ప్రైవేట్ బస్సులు దోచుకుంటున్నాయి: విజయసాయి

image

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయని YCP MP విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రెగ్యులర్ ఛార్జీలపై డబుల్, ట్రిపుల్ వసూలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని కోరారు. మామూలు రోజుల్లో రూ.1500 వరకు ఉండే HYD- వైజాగ్ ప్రైవేట్ బస్సుల AC స్లీపర్ టికెట్‌కి ప్రస్తుతం రూ.5K, రూ.1200 వరకు ఉండే HYD-TPT టికెట్ రూ.3Kకి పైగా వసూలు చేస్తున్నాయి.

Similar News

News March 7, 2026

ఇరాన్ ఓడిపోయింది.. ఇక బెదిరించలేదు: ట్రంప్

image

గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ <<19319891>>సారీ చెప్పడంపై<<>> అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. వేల ఏళ్ల చరిత్రలో మిడిల్ ఈస్ట్ దేశాల ముందు ఇరాన్ ఓడిపోవడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇకపై పొరుగు దేశాలను అది బెదిరించలేదని ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. ఇందుకు మధ్యప్రాచ్య దేశాలన్నీ తనకు థాంక్యూ చెప్పాయన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులకు ఇరాన్ తోకముడిచి క్షమాపణ చెప్పిందని ఎద్దేవా చేశారు.

News March 7, 2026

రేపు కెప్టెన్ సూర్య రిటైర్మెంట్?

image

INDT20 జట్టు కెప్టెన్ సూర్య రేపు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. కివీస్‌తో జరిగే T20WC ఫైనల్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఫామ్ తగ్గడం, వయసు పెరగడం(35 ఏళ్లు), కెరీర్ చివరి దశలో ఉన్నందున రిటైర్మెంట్‌కు ఇదే మంచి తరుణమని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా SKY కెప్టెన్సీలో IND ఒక్క సిరీసూ ఓడిపోలేదు. అయితే బ్యాటర్‌గా విఫలమవుతున్నారు.

News March 7, 2026

8 మంది MLAలకు క్లీన్ చిట్

image

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో తీర్పును ఆయన రిజర్వ్ చేశారు.