News April 14, 2024
ప్రొద్దుటూరు: ‘రాచ’ మార్గమేనా? ‘వరద’ అడ్డుకుంటారా?

AP: YSR జిల్లాలోని ప్రొద్దుటూరుకు అరుదైన రికార్డు ఉంది. 1957 నుంచి 1978 వరకు వరుసగా 5 ఎన్నికల్లో ఇండిపెండెంట్లే హవా సాగించారు. 6సార్లు INC, 3సార్లు TDP, 2సార్లు YCP అభ్యర్థులు గెలిచారు. ఈసారి రాచమల్లు శివప్రసాద్రెడ్డి(YCP) హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా, టీడీపీ నుంచి రాజకీయ కురువృద్ధుడు నంద్యాల వరదరాజులు రెడ్డి బరిలో దిగుతున్నారు. ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు.<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News April 4, 2026
పాయింట్ల టేబుల్లో పంజాబ్ ‘కింగ్’

IPL-2026లో ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచిన ఏకైక జట్టుగా PBKS నిలిచింది. దీంతో ఆ టీమ్ 4 పాయింట్లతో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. అదే సమయంలో CSK ఆడిన 2 మ్యాచుల్లో ఓడి పాయింట్ల ఖాతా తెరవలేదు. -2.562 నెట్ రన్రేట్తో అట్టడుగు స్థానంలో నిలిచింది. SRH 2 ఆడి ఒకదాంట్లో గెలవగా, KKR 2 మ్యాచుల్లోనూ ఓడి పాయింట్లు సాధించలేదు. RR, RCB, DC, MI ఒక్కో మ్యాచ్ ఆడి గెలవగా(2 పాయింట్లు), GT, LSG ఓడిపోయాయి.
News April 4, 2026
ఔషధాలపై ట్రంప్ టారిఫ్స్.. ఇండియాపై ప్రభావమెంత?

అమెరికా రీసెంట్గా కొన్ని పేటెంటెడ్ డ్రగ్స్పై 100% టారిఫ్స్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇండియాపై పెద్దగా ప్రభావం ఉండదని GTRI చెబుతోంది. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లేది తక్కువ ధర ఉండే ‘జనరిక్’ మెడిసిన్స్ మాత్రమేనని వివరించింది. మన ఎగుమతుల్లో పేటెంటెడ్ డ్రగ్స్ వాటా తక్కువ కాబట్టి మన ఫార్మా కంపెనీలు సేఫ్ జోన్లోనే ఉన్నాయని స్పష్టం చేసింది.
News April 4, 2026
ఇవాళ, రేపు జాగ్రత్త!

AP: రాష్ట్రంలో ఈరోజు, రేపు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఇక ఏలూరు, పల్నాడు జిల్లాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా నిన్న 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మన్యం(D)లోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీలు నమోదైంది.


