News October 6, 2024
ప్రకాశ్ రాజ్కు నిర్మాత కౌంటర్

TN డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో కూర్చున్న ఫొటో షేర్ చేసిన ప్రకాశ్ రాజ్కు తమిళ నిర్మాత వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ‘మీతో ఉన్న ముగ్గురు ఎన్నికల్లో గెలిస్తే, మీరు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అది మీ మధ్య తేడా. ఎలాంటి కారణం చెప్పకుండా మీరు షూటింగ్ నుంచి వెళ్లడంతో నాకు రూ.కోటి నష్టం వచ్చింది. కాల్ చేస్తానని ఇంతవరకు చేయలేదు’ అని ట్వీట్ చేశారు. ఈయన ప్రకాశ్ రాజ్తో ‘ఎనిమీ’ మూవీ తీశారు.
Similar News
News April 2, 2026
RECORD: ‘యశోద-కృష్ణ’ పెయింటింగ్కు ₹167కోట్లు

ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ‘యశోద-కృష్ణ’ ఆయిల్ పెయింటింగ్ వేలంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబైలో జరిగిన వేలంలో ఈ చిత్రం ఏకంగా రూ.167.2 కోట్లకు అమ్ముడైంది. భారతీయ కళా చరిత్రలో అత్యధిక ధర పలికిన చిత్రంగా ఇది నిలిచింది. గతంలో ఈ రికార్డు MF హుస్సేన్ గీసిన ‘అన్టైటిల్డ్’ పెయింటింగ్పై ఉండేది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ సైరస్ పూనావాలా ఈ అరుదైన కళాఖండాన్ని సొంతం చేసుకున్నారు.
News April 2, 2026
మరోసారి తగ్గిన గోల్డ్ రేటు

పెట్టుబడిదారులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. ట్రంప్ ప్రకటనతో డాలర్పై ఒత్తిడి, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల బంగారం ధరలు ఇవాళ <<19544455>>మరోసారి<<>> పడిపోయాయి. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.3,980 తగ్గి రూ.1,48,970కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.3,650 పతనమై రూ.1,36,550 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది. తగ్గుతున్న ధరలు కొనుగోలుదారులకు ఊరటనివ్వనున్నాయి.
News April 2, 2026
చట్టబద్ధతతో శాశ్వత రాజధానిపై స్పష్టత: రామ్మోహన్

విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో చర్చ సందర్భంగా అన్నారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధతతో ప్రజలకు స్పష్టత ఇస్తున్నామని తెలిపారు. 2014లోనే అమరావతిపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని గుర్తుచేశారు. కానీ 2019-24 మధ్య YCP ప్రభుత్వం 3 రాజధానుల నాటకమాడిందని మండిపడ్డారు. రాజధాని కోసం ఉద్యమించిన రైతులను హింసించిందని ఆరోపించారు.


