News July 26, 2024
హీరో విశాల్ సినిమాలపై నిర్మాతల మండలి ఆంక్షలు

హీరో విశాల్తో ఎవరూ పనిచేయొద్దంటూ తమిళ నిర్మాతల మండలి ఒక లేఖ విడుదల చేసింది. ఆయనతో సినిమా తీయాలంటే అనుమతి తప్పనిసరి అని ఆంక్షలు విధించింది. 2017-19 మధ్య నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న ఆయన, రూ.12కోట్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలను విశాల్ ఖండించారు. తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తెలిపారు.
Similar News
News October 25, 2025
పాములను పూజించడం వెనుక పర్యావరణ హితం

సాధారణంగా శీతాకాలంలో, పంటలు ఇంటికొచ్చే సమయంలో పాములు పుట్టల నుంచి, వాటి రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. ఈ సమయంలో వాటిని హింసించకుండా ఉండేందుకు ఈ పండుగ జరుపుతారు. నాగ దేవతలు పొలాల్లోని ధాన్యాన్ని నాశనం చేసే ఎలుకలను వేటాడి, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ప్రకృతిలోని ఏ జీవినీ సంహరించకుండా, ప్రతి ప్రాణికీ జీవించే హక్కును గౌరవించాలని మన ఆచారం బోధిస్తుంది. పాములను పూజించడం ద్వారా నాగజాతిని కాపాడినట్లే.
News October 25, 2025
ఏపీ TET-2025 షెడ్యూల్ ఇదే..

ఏపీలో <
News October 25, 2025
నితీశ్ కుమార్ దూరం.. కారణం ఏంటంటే?

భారత యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి గాయమైంది. అడిలైడ్లో రెండో వన్డే ఆడుతున్న సమయంలో ఎడమ తొడ కండరాలకు గాయం కాగా నేటి మ్యాచ్ సమయానికి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో ఇవాళ్టి వన్డేకు దూరమయ్యారు. నితీశ్ గాయంపై తమ మెడికల్ టీమ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు BCCI వెల్లడించింది. అటు తొలి వన్డేలో చివర్లో సిక్సులతో నితీశ్ విరుచుకుపడ్డారు. బౌలింగ్లో చాలినంత అవకాశం రాలేదు.


