News September 13, 2024

నిన్న రూ.7లక్షల కోట్ల లాభం.. స్టాక్‌మార్కెట్లు నేడెలా ఉన్నాయంటే!

image

క్రితం సెషన్లో రికార్డులు బద్దలుకొట్టిన బెంచ్‌మార్క్ సూచీలు నేడు మోస్తరు నష్టాల్లో కొనసాగుతున్నాయి. BSE సెన్సెక్స్ 125 పాయింట్లు తగ్గి 82,844 వద్ద చలిస్తోంది. NSE నిఫ్టీ 42 పాయింట్లు ఎరుపెక్కి 25,346 వద్ద ట్రేడవుతోంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 18:32గా ఉంది. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విప్రో, టాటా స్టీల్, JSW స్టీల్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్.

Similar News

News September 4, 2025

వీటిపై త్వరలో 40శాతం జీఎస్టీ!

image

లగ్జరీ వస్తువులపై త్వరలో 40 శాతం పన్ను విధిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాన్‌మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై ఈ మేరకు జీఎస్టీ వసూలు చేస్తామని తెలిపారు. ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్‌పై 40శాతం పన్ను ఉంటుందని పేర్కొన్నారు. వీటిపై ఇప్పటి వరకు ఉన్న 28శాతం శ్లాబులే కొనసాగనుండగా, త్వరలో 40 శాతం అమలు చేస్తామన్నారు.

News September 4, 2025

GST శ్లాబులతో సామాన్యులకు మేలు: మోదీ

image

సామాన్య ప్రజలకు మేలు చేకూరుస్తూ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేలా కొత్త GST <<17605492>>శ్లాబులు<<>> ప్రకటించామని PM మోదీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్ణయం రైతులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత, చిన్న-మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఇది పౌరుల జీవితాలను మరింత మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. చిరు వ్యాపారులు సులభంగా వ్యాపారం చేసుకునేందుకు దోహదపడుతుందని మోదీ వెల్లడించారు.

News September 4, 2025

ఆ శరణార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

image

అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చిన మైనార్టీలకు(ముస్లిమేతరులు) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పాస్ పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకున్నా దేశంలో ఉండటానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 31, 2024 వరకు దేశానికి వచ్చిన వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ యాక్ట్ కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పింది.