News November 11, 2024
ప్రారంభంలో లాభాలు.. చివరికి ఫ్లాట్గా ముగిశాయి

సోమవారం మిడ్ సెషన్ వరకు 251 పాయింట్ల లాభంతో సాగిన నిఫ్టీ చివరికి 6 పాయింట్ల నష్టంతో 24,141 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కూడా 808 పాయింట్ల లాభం నుంచి 9 పాయింట్ల లాభానికి పతనమై 79,496 వద్ద చలించింది. నిఫ్టీలో 24,300 వద్ద, సెన్సెక్స్లో 80,100 వద్ద ఉన్న కీలకమైన రెసిస్టెన్స్ను సూచీలు అధిగమించలేకపోయాయి. Power Grid 4.35%, Trent 2.60% లాభపడగా, Asian Paint 8%, Britannia 2.60% నష్టపోయాయి.
Similar News
News November 22, 2025
ఓపెనర్గా ఫాస్టెస్ట్ సెంచరీ.. వార్నర్ సరసన హెడ్

ENGతో తొలి టెస్టులో 69బంతుల్లోనే సెంచరీ చేసిన AUS ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఓపెనర్గా వచ్చి వేగంగా శతకం బాదిన బ్యాటర్గా వార్నర్ సరసన నిలిచారు. 2012లో INDపై వార్నర్ 69బాల్స్లోనే సెంచరీ కొట్టారు. ఇక ఛేజింగ్లో 4వ ఇన్నింగ్స్లో వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా, ఓవరాల్గా ఫాస్టెస్ట్ శతకం బాదిన 8వ బ్యాటర్గా హెడ్ నిలిచారు. ఈ జాబితాలో తొలి స్థానంలో మెక్కల్లమ్ ఉన్నారు. ఆయన AUSపై 54బంతుల్లోనే సెంచరీ కొట్టారు.
News November 22, 2025
అలాగైతే తులం బంగారం, రూ.2,500 ఇచ్చేవాళ్లం: జూపల్లి

TG: పథకాల అమలుపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తులం బంగారం, రూ.2,500 ఏమయ్యాయంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో పాటు బంగారం ఇవ్వాలంటే మరో రూ.లక్ష అవుతుంది. తులం బంగారం అమలుకు రూ.4వేల కోట్లు, మహిళలకు రూ.2,500 ఇవ్వడానికి రూ.10వేల కోట్లు కావాలి. ఏడాదికి రూ.75వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. BRS అప్పులు చేయకుండా ఉండి ఉంటే పథకాలన్నీ అమలయ్యేవి’ అని అన్నారు.
News November 22, 2025
కమిటీల నిర్మాణం, కూర్పుపై జనసేన ఫోకస్: హరిప్రసాద్

AP: పార్టీ బలోపేతంపై JSP చీఫ్ పవన్ ఫోకస్ పెట్టినట్లు పార్టీ ముఖ్యనేత హరిప్రసాద్ తెలిపారు. ‘కమిటీల నిర్మాణంపై కసరత్తు, నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై పవన్ దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ కమిటీల వరకు నిర్మాణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పార్టీ శ్రేణుల మనోగతం, సూచనలను కార్యాలయ కమిటీ నమోదు చేస్తోంది’ అని పేర్కొన్నారు.


