News November 11, 2024
ప్రారంభంలో లాభాలు.. చివరికి ఫ్లాట్గా ముగిశాయి

సోమవారం మిడ్ సెషన్ వరకు 251 పాయింట్ల లాభంతో సాగిన నిఫ్టీ చివరికి 6 పాయింట్ల నష్టంతో 24,141 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కూడా 808 పాయింట్ల లాభం నుంచి 9 పాయింట్ల లాభానికి పతనమై 79,496 వద్ద చలించింది. నిఫ్టీలో 24,300 వద్ద, సెన్సెక్స్లో 80,100 వద్ద ఉన్న కీలకమైన రెసిస్టెన్స్ను సూచీలు అధిగమించలేకపోయాయి. Power Grid 4.35%, Trent 2.60% లాభపడగా, Asian Paint 8%, Britannia 2.60% నష్టపోయాయి.
Similar News
News December 13, 2025
కోనసీమ ‘రాజ’సం.. మన రాజుగారు

కోనసీమ మట్టి పరిమళం, కళాత్మక విలువల మేళవింపు డీవీఎస్ రాజు. అల్లవరం గడ్డపై పుట్టి, భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రభావితం చేసిన ఆ ‘సినీ భీష్ముడి’ జయంతి నేడు. ఆయన తండ్రి డి.బలరామరాజు నరసాపురం ఎంపీగా ప్రజాసేవలో ఉంటే, తనయుడు డీవీఎస్ రాజు కళామతల్లి సేవలో తరించారు. కేవలం నిర్మాతగానే కాకుండా, జాతీయ స్థాయిలో NFDC ఛైర్మన్గా తెలుగు వారి కీర్తిని దశదిశలా చాటి దార్శనికుడిగా నిలిచారు.
News December 13, 2025
పొదుగు పెద్దగా ఉంటేనే ఎక్కువ పాలు వస్తాయా?

కొందరు గేదెను కొనుగోలు చేసే ముందు దాని పొదుగును చూస్తారు. పెద్ద పొదుగు ఉంటే అది ఎక్కువ పాలు ఇస్తుందని అనుకుంటారు. పెద్ద పొదుగు ఉన్నంత మాత్రాన అది ఎక్కువ పాలు ఇవ్వదు. పాలు పితికిన తర్వాత పొదుగు గాలి తీసిన బెలూన్లా మెత్తగా, ముడతలు పడే గుణం ఉండాలి. అలా కాకుండా పాలు తీశాక కూడా గట్టిగా ఉంటే అది మాంసపు పొదుగుగా గుర్తించాలి. అది ఎక్కువ పాల దిగుబడికి పనికిరాదని భావించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 13, 2025
2026 కల్లా వెలిగొండ పనులు పూర్తి: మంత్రి నిమ్మల

AP: వెలిగొండ పనుల్లో రోజువారీ లక్ష్యాలను పెంచామని, 2026 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు టన్నెల్లో 18KM లోపలి వరకు వెళ్లి పనులను పరిశీలించారు. ప్రస్తుత వర్క్తో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేయడానికి రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని ఆయన చెప్పారు. ఇన్ని పనులుండగా ప్రాజెక్టు పూర్తయిపోయిందని జగన్ జాతికి అంకితం చేయడం ఎంత విడ్డూరమో ఆలోచించాలన్నారు.


