News April 2, 2024

‘ప్రాజెక్ట్ టైగర్’కు 51 ఏళ్లు.. 70% పులులు భారత్‌లోనే!

image

దేశంలో పులుల సంరక్షణ, వాటి సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం APR 1, 1973న ‘ప్రాజెక్ట్ టైగర్‌’ను ప్రారంభించింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ 51ఏళ్లు పూర్తి చేసుకుందని ఓ IFS అధికారి ట్వీట్ చేశారు. మొత్తం 9 టైగర్ రిజర్వ్‌లలో పులుల సంరక్షణ కొనసాగుతోందన్నారు. దీంతో 2006లో 1411 పులులుండగా.. 2022లో వాటి సంఖ్య 3682కి చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 70% ఇండియాలోనే ఉన్నట్లు వెల్లడించారు.

Similar News

News March 15, 2026

భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో గత వారం KG స్కిన్ లెస్ ₹290-300 ఉండగా, ఇవాళ రూ.350 వరకు అమ్ముతున్నారు. APలోని పలు ప్రాంతాల్లో ₹315-320గా ఉంది. ఇవాళ ఆదివారం కావడంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుమతి తగ్గడం, ఎండ వేడికి కోళ్లు చనిపోతుండటంతో ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయికి చికెన్ రేటు చేరడం ఇదే తొలిసారని వ్యాపారులు అంటున్నారు.

News March 15, 2026

సరదా కోసం మరోసారి దాడి చేస్తాం: ట్రంప్

image

ఇరాన్‌లోని <<19378419>>ఖర్గ్<<>> ద్వీపంపై కేవలం ఫన్ కోసమే తాము మరిన్ని దాడులు చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ తమతో డీల్‌కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ కండీషన్లే సరిగ్గా లేవని విమర్శించారు. ‘ఖర్గ్‌లోని చాలా భాగాన్ని పూర్తిగా నాశనం చేశాం. మేం వినోదం కోసం మళ్లీ అటాక్స్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ బతికే ఉన్నారా’ అని ప్రశ్నించారు.

News March 15, 2026

వారికి LPG సిలిండర్లు బంద్.. కేంద్రం ప్రకటన

image

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు ఉన్నవారికి ఎల్పీజీ సిలిండర్లు సప్లై చేయవద్దని కేంద్రం ఆదేశించింది. PNG వినియోగించుకుంటూనే డొమెస్టిక్ సిలిండర్లు తీసుకోవడం మంచిది కాదంది. వెంటనే LPG కనెక్షన్లు సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. చమురు సంస్థలు వారికి కొత్తగా LPG కనెక్షన్లూ ఇవ్వొద్దని ఆదేశించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో HYDతో పాటు విశాఖ, విజయవాడ, గుంటూరు, కడప తదితర నగరాల్లో PNG సౌకర్యం ఉంది.