News December 19, 2024

ప్రముఖ రచయిత కన్నుమూత

image

AP అరసం గౌరవ సలహాదారు, కథ, నవలా రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్(80) విజయవాడలో గుండెపోటుతో నిన్న కన్నుమూశారు. సాహిత్యంపై ఆసక్తితో 11 ఏళ్లకే రచనా ప్రస్థానం ప్రారంభించారు. 1974లో తొలి కథ ప్రచురితమైంది. 600కు పైగా కథ, కథానిక, నవల, నవలిక, హరికథ, నాటకాలు, 400కు పైగా వ్యాసాలు రాశారు. సైనికుడిగా 1965, 1971లో భారత్-పాక్ యుద్ధాల్లో పాల్గొన్నారు. హైకోర్టు లాయరుగా, బార్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడిగా ఉన్నారు.

Similar News

News January 18, 2026

నితీశ్ కుమార్ రెడ్డికి మంచి ఛాన్స్..

image

వరుస ఫెయిల్యూర్స్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న నితీశ్ రెడ్డికి మంచి ఛాన్స్ దొరికింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కీలక వికెట్లు కోల్పోగా.. విరాట్, నితీశ్ క్రీజులో ఉన్నారు. భారత్ మ్యాచ్ గెలవాలంటే వీరిద్దరి మధ్య కీలక భాగస్వామ్యం తప్పనిసరి. మరి నితీశ్ అనుభవజ్ఞుడైన కోహ్లీతో కలిసి రాణిస్తారా? కామెంట్ చేయండి.

News January 18, 2026

చేతబడి వల్లే నా భార్య మృతి: నటి భర్త

image

నటి, మోడల్ షెఫాలీ జరీవాలా మృతిపై ఆమె భర్త పరాగ్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘షెఫాలీపై ఎవరో రెండుసార్లు చేతబడి చేశారు. తొలిసారి తప్పించుకున్నాం. కానీ రెండోసారి మరింత ఎక్కువగా చేశారు. ఎవరు, ఎందుకు, ఎలా చేశారనేది నాకు తెలియదు. కానీ ఏదో తప్పుగా జరిగిందని మాత్రం చెప్పగలను’ అని అన్నారు. గతేడాది జూన్ 27న షెఫాలీ చనిపోయారు. అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట, వెంకీ మామ చిత్రాల్లో పరాగ్ త్యాగి నటించారు.

News January 18, 2026

టాపార్డర్ ఫెయిల్.. భారత్ గెలుస్తుందా?

image

న్యూజిలాండ్‌తో 338 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ తడబడుతోంది. 71 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ (11), గిల్ (23), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు. ప్రస్తుతం విరాట్ (31*), నితీశ్ కుమార్ రెడ్డి (0*) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 13 ఓవర్లలో 71/4గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 222 బంతుల్లో 267 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.