News April 9, 2025
పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులు.. కీలక నిర్ణయం

AP: పంచాయితీ రాజ్ వ్యవస్థలో పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం జీవో 35ను విడుదల చేసింది. MPDO కార్యాలయాల్లోని పంచాయతీ విస్తరణ అధికారుల క్యాడర్ను డిప్యూటీ MPDOగా మార్పు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల సంఘం నేత జగన్ మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు MPDO పోస్టుల భర్తీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టారని, ఇక నుంచి పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు.
Similar News
News January 25, 2026
మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్టులో మరో 14 కులాలు

TG: మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (MBC) లిస్టులో మరో 14 కులాలను చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలో కేంద్రానికి లేఖ రాయనుంది. ప్రస్తుతం MBC లిస్టులో 36 కులాలు ఉండగా, ఆ సంఖ్య 50కి చేరనుంది.
14 కులాలు: దాసరి(బెగ్గరి), జంగం, పంబాల, వాల్మికి బోయ, తల్యారీ, చుండువాళ్లు, యాట, సిద్దుల, సిక్లింగర్, ఫకీర్, గుడ్డి ఏలుగు, కునపులి, రాజనాల, బుక్క అయ్యవారాస్.
News January 25, 2026
రథసప్తమి.. తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం

రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈరోజు మలయప్పస్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు విభిన్న వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ నుంచి చంద్రప్రభ వరకు వాహన సేవలు కొనసాగనున్నాయి. నేడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, VIP బ్రేక్ దర్శనాలను TTD రద్దు చేసింది. భక్తులకు 14 రకాల అన్నప్రసాదాలు పంపిణీ చేయనుంది. వరుస సెలవులతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఛాన్సుంది.
News January 25, 2026
బంగ్లాదేశ్కు అన్యాయం జరిగింది: నఖ్వీ

T20 WC నుంచి తప్పించి బంగ్లాదేశ్కు ICC అన్యాయం చేసిందని PCB ఛైర్మన్ మోషిన్ <<18947264>>నఖ్వీ<<>> అన్నారు. ‘భారత్, పాకిస్థాన్ కోసం వెన్యూలు మార్చినప్పుడు బంగ్లాదేశ్ కోసం ఎందుకు మార్చరు? ఐసీసీని ఒకే దేశం డిక్టేట్ చేస్తోంది. ఐసీసీకి డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. ఓ దేశం కోసం నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. మరో దేశానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. అందుకే మేం బంగ్లాదేశ్కు మద్దతిస్తున్నాం’ అని తెలిపారు.


