News September 7, 2024
భారత్లో ముషారఫ్ సంబంధీకుల ఆస్తి.. రూ.1.39 కోట్లకు వేలం

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సన్నిహితుల ఆస్తిని భారత్ ఈ నెల 5న రూ.1.39 కోట్లకు వేలం వేసింది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో ఆయన సంబంధీకుల పేరిట ఆస్తి ఉంది. స్థానిక రైతులు ముగ్గురు కలిసి దాన్ని కొనుగోలు చేశారు. 2010లో ఆ ఆస్తిని ‘శత్రువుల ఆస్తి’గా భారత్ ప్రకటించింది. అప్పటి నుంచీ ఇది ‘ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ ఆఫీస్’ అధీనంలోనే ఉంది. కాగా.. ముషారఫ్ గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


