News February 5, 2025
ఏపీలో మిరప బోర్డు కోసం ప్రతిపాదనలు

APలో మిర్చి బోర్డు ఏర్పాటు కోసం తమకు ప్రతిపాదనలు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం సుగంధ ద్రవ్యాల బోర్డే దేశంలో మిర్చి ఉత్పత్తి, పరిశోధన, నాణ్యతా నిర్వహణ, దేశీయ మార్కెట్, ఎగుమతులు, ప్రోత్సాహకాలు సహా పలు విషయాలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. మిర్చి నిల్వ పద్ధతులు, మార్కెట్ లింకేజ్ సహా ఇతర అంశాలపై రైతులు, వ్యాపారులకు ఈ బోర్డే సహాయం అందిస్తోందని వెల్లడించారు.
Similar News
News December 8, 2025
స్వాతంత్ర్యం రాకముందు నుంచే..!

ఇండియాలో ఏటా కొత్త కంపెనీలు పుట్టుకొస్తూనే ఉంటాయి. పోటీని తట్టుకోలేక అందులో కొన్ని మూతబడటం చూస్తుంటాం. అలాంటిది దేశానికి స్వాతంత్ర్యం రాకముందే నెలకొల్పిన చాలా కంపెనీలు యుద్ధాలు, సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డాయి. అందులో మైసూర్ శాండల్ సోప్(1916), మహీంద్రా & మహీంద్రా(1945), అమూల్(1946), ఎయిర్ ఇండియా (1932), పార్లేజీ (1929), బాటా (1931), బజాజ్ ఆటో (1945), ఏషియన్ పెయింట్స్(1942) ఉన్నాయి.
News December 8, 2025
అఖండ-2 విడుదలపై అప్డేట్!

బాలకృష్ణ ‘అఖండ-2’ విడుదలకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న(శుక్రవారం) సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు చెబుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా నిర్మాణ సంస్థ ‘14 రీల్స్’ వివాదంలో <<18471402>>చిక్కుకున్న<<>> విషయం తెలిసిందే. దీంతో అఖండ-2 విడుదల వాయిదా పడింది.
News December 8, 2025
మీ ఫ్రిజ్ ఎక్కువకాలం పనిచేయాలంటే?

* ఫ్రిజ్ కంపార్ట్మెంట్ టెంపరేచర్ను 4°C, ఫ్రీజర్ను -18°C వద్ద మెయింటేన్ చేయండి.
* వేడి కంటైనర్లను నేరుగా లోపల పెట్టవద్దు.
* సరిగ్గా డోర్ వేయండి. పదేపదే డోర్ తెరవొద్దు.
* ఫ్రిజ్ కాయిల్స్, లోపలి భాగాలను తరచూ క్లీన్ చేయండి.
* ఫ్రిజ్ను పూర్తిగా నింపేయకుండా ఖాళీ స్థలాన్ని ఉంచండి.
* ఫ్రిజ్ చుట్టూ కనీసం 10CM స్థలాన్ని వదలండి.
* ఒవెన్స్, డిష్ వాషర్స్, డైరెక్ట్ సన్లైట్కు దూరంగా ఫ్రిజ్ను ఉంచండి.


