News November 22, 2024

PAC ఎన్నికపై మండలిలో నిరసన

image

AP: పీఏసీ ఎన్నికపై శాసనమండలిలో YCP సభ్యులు నిరసన తెలిపారు. వేరే సభలో అంశం ఇక్కడ వద్దని మండలి ఛైర్మన్ వారిని వారించారు. దీంతో వారు మండలి నుంచి వాకౌట్ చేశారు. జగన్ ఎందుకు ఓటింగ్‌కు రాలేదని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. ఎందుకు వాకౌట్ చేస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని కోరారు. అటు అసెంబ్లీలో వివిధ కమిటీ సభ్యుల ఎన్నికకు ఇప్పటి వరకు 163మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సీఎం చంద్రబాబు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

Similar News

News November 26, 2025

రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు

image

ధర్మవరం పట్టణానికి చెందిన బాలికలు యశస్విని, అలేఖ్య.. బాలుర విభాగంలో విజయ్ తరుణ్, సాయికుమార్ రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొంటారని బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు విజయవాడలో జరిగే 69వ ఏపీ స్కూల్ గేమ్స్ అండర్-19 ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.

News November 26, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1683 గ్రామ పంచాయతీలకు, 14776 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి దశలో 555 జీపీలు, 4952 వార్డులకు ఎన్నికలు జరగనుండగా.. రెండో దశలో 564 జీపీలు, 4928 వార్డులకు జరగనున్నాయి. మూడో దశలో 564 జీపీలకు, 4896 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

News November 26, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1683 గ్రామ పంచాయతీలకు, 14776 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి దశలో 555 జీపీలు, 4952 వార్డులకు ఎన్నికలు జరగనుండగా.. రెండో దశలో 564 జీపీలు, 4928 వార్డులకు జరగనున్నాయి. మూడో దశలో 564 జీపీలకు, 4896 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.