News March 21, 2024

లద్దాఖ్‌లో నిరసనలు.. 16వ రోజుకు నిరాహార దీక్ష!

image

కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాక్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ కొన్ని రోజులుగా స్థానికులు నిరసన చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ఇంజినీర్, సంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది. లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ (గిరిజన హక్కుల పరిరక్షణ) పరిధిలోకి తేవాలనేది నిరసనకారుల డిమాండ్. కేంద్రంతో గతంలో చర్చలు విఫలం కావడంతో వీరు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Similar News

News March 2, 2026

స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 1/2

image

ఒకప్పుడు US, సోవియట్ యూనియన్‌లు అంతరిక్షంలో పైచేయి కోసం పోటాపోటీగా ప్రాజెక్టులు చేపట్టాయి. మూన్ ల్యాండింగ్‌పై నాసాకు పోటీగా చైనా కూడా ప్రాజెక్ట్ స్పీడప్ చేసినట్లు ప్రకటించడంతో మరోసారి ఇది తెరమీదకు వచ్చింది. 2028 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపాలని నాసా ప్లాన్ చేయగా.. చైనా ఈ టార్గెట్ 2030కి పెట్టుకుంది. మరోవైపు భారత్ సైతం 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి దింపాలని అనుకుంటోంది.

News March 2, 2026

స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 2/2

image

మూన్ ల్యాండింగ్‌తో పాటు వివిధ స్పేస్ ప్రాజెక్టులపైనా భారత్ ఫోకస్ పెంచింది. ఇదంతా ఒకప్పుడు ప్రతిష్ఠ కోసమైతే ఇప్పుడు అది అవసరం. అంతరిక్షంపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాలను శాసించగలమని, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోగలమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అంతేకాదు స్పేస్‌లో మరింత లోతుగా అన్వేషించేందుకు చంద్రుడిని వ్యోమనౌకల రీఫ్యూల్లింగ్ స్టేషన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

News March 2, 2026

దాడికి ముందు ఇరాన్‌ పౌరులకు ఇజ్రాయెల్ మెసేజ్

image

ఇరాన్‌పై USతో కలిసి మొదటి దాడి చేసే కొన్ని నిమిషాల ముందు అక్కడి పౌరులు, అధికారులకు ఇజ్రాయెల్ సందేశం పంపినట్లు తెలుస్తోంది. ప్రార్థన వేళలు తెలిపే ‘బడే‌సబాహ్’ యాప్ హ్యాక్ చేసి నోటిఫికేషన్లు పంపింది. ‘ప్రతీకారానికి సమయం వచ్చింది’, ‘అమాయక ఇరాన్ ప్రజలను పీడిస్తున్న వారు ఆయుధాలు వదలండి’ అంటూ ఆ సందేశాలు సాగాయి. దాడిపై ఇరాన్ ప్రజల మద్దతు కోసం, అధికారులను హెచ్చరించేందుకు ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.