News August 21, 2024
ఇ-కామర్స్ వృద్ధికి గర్వమేల: పీయూష్ గోయల్

రాబోయే పదేళ్లలో మన మార్కెట్లో సగం ఇ-కామర్స్ నెట్వర్క్లో భాగమవ్వడం గర్వించే విషయం కాదని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిజానికిది ఆందోళనకరమని చెప్పారు. ఇది ప్రిడేటరీ ప్రైసింగ్కు దారితీస్తుందని, సామాజిక అంతరాలు ఏర్పడొచ్చని హెచ్చరించారు. కొద్దిమందే ఆన్లైన్లో గ్రాసరీస్ కొనడం కొంత ఉపశమనం అన్నారు. అమెజాన్ వంటి సంస్థల పెట్టుబళ్లతో ఎకానమీకి ఏమీ ఒరగదని, దాంతో రిటైల్ స్టోర్లు మూతపడొచ్చన్నారు.
Similar News
News January 10, 2026
WPL: ఇవాళ డబుల్ ధమాకా

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్లో నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. టోర్నీలో 5 జట్లే పాల్గొంటుండటంతో టీమ్లు వరుస రోజుల్లో మ్యాచులు ఆడే పరిస్థితి ఏర్పడింది. నిన్న తొలి మ్యాచులో RCB చేతిలో <<18814463>>ఓడిన<<>> ముంబై ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ను ఎదుర్కోనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే మ్యాచులో గుజరాత్-యూపీ వారియర్స్ తలపడతాయి. హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్లో లైవ్ చూడవచ్చు.
News January 10, 2026
త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: శ్రీధర్ బాబు

TG: నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఐఐటీ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. గ్రూప్స్ ద్వారా ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాగా ఇటీవల జాబ్ క్యాలెండర్ కోరుతూ విద్యార్థులు <<18794438>>ఆందోళన<<>> చేపట్టిన విషయం తెలిసిందే.
News January 10, 2026
‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్తో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకూ వచ్చాయని ‘sacnilk’ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ నమోదు చేసినట్లు పేర్కొంది. కాగా ఏపీలో టికెట్ల రేట్ల పెంపు కొనసాగుతుండగా తెలంగాణలో పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది.


