News August 1, 2024
PROVED: 20ఏళ్లకే రిటైర్.. 58ఏళ్లకు రీఎంట్రీ

టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి జెంగ్ జియింగ్ 58ఏళ్ల వయసులో పారిస్ ఒలింపిక్స్లో అరంగేట్రం చేశారు. ఆమె కథలో ఎన్నో మలుపులున్నాయి. 18ఏళ్ల వయసులో చైనాకు ఆడేటప్పుడు ఆమె వరల్డ్ టాప్ ప్లేయర్. 2సైడ్ ప్యాడిల్ రూల్ 1సైడ్గా మారడంతో చైనీస్ ఒలింపిక్ టీమ్కు దూరమయ్యారు. విసుగెత్తి 20ఏళ్లకే రిటైర్ అయ్యారు. ఆ తర్వాత చిలీకి షిఫ్ట్ అయిన జెంగ్ కరోనా సమయంలో మళ్లీ ఆడాలని నిర్ణయించుకుని ఆ దేశం తరఫున రీఎంట్రీ ఇచ్చారు.<<-se>>#Olympics2024<<>>
Similar News
News February 1, 2026
4 గంటలు.. అటు కేసీఆర్ విచారణ.. ఇటు ఆందోళనలు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు 4 గంటలుగా విచారిస్తున్నారు. మధ్యాహ్నం 3 నుంచి ప్రారంభమైన విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రశ్నలకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. విచారణ మొత్తం ఆడియో, వీడియో రూపంలో చిత్రీకరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి.
News February 1, 2026
ప్రజాకర్షక పథకాల జోలికెళ్లని బడ్జెట్!

ఈసారి బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలు పెద్దగా కనిపించలేదు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్యాకేజీలు, ప్రత్యేక పథకాల వంటివేమీ ప్రకటించలేదు. కేవలం కొన్ని మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులనే కట్టబెట్టారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా చేపట్టిన ఇనీషియేటివ్స్కు కొనసాగింపుగానే చాలా ప్రకటనలు ఉన్నాయి. పన్నుల విషయంలోనూ ఉద్యోగులను ఆకర్షించే పెద్ద అనౌన్స్మెంట్స్ లేవని నిపుణులు అంటున్నారు.
News February 1, 2026
అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలి: హైకోర్టు

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటలూ భద్రత కల్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు దీన్ని కొనసాగించాలని సూచించింది. అంబటి భార్య వేసిన హౌస్ మోషన్ పిటిషన్పై కోర్టు ఆదేశాలు జారీచేసింది. అంబటి ఇంటిపై దాడి కేసులో న్యాయస్థానం సీరియస్గా స్పందించింది.


