News August 1, 2024
PROVED: 20ఏళ్లకే రిటైర్.. 58ఏళ్లకు రీఎంట్రీ

టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి జెంగ్ జియింగ్ 58ఏళ్ల వయసులో పారిస్ ఒలింపిక్స్లో అరంగేట్రం చేశారు. ఆమె కథలో ఎన్నో మలుపులున్నాయి. 18ఏళ్ల వయసులో చైనాకు ఆడేటప్పుడు ఆమె వరల్డ్ టాప్ ప్లేయర్. 2సైడ్ ప్యాడిల్ రూల్ 1సైడ్గా మారడంతో చైనీస్ ఒలింపిక్ టీమ్కు దూరమయ్యారు. విసుగెత్తి 20ఏళ్లకే రిటైర్ అయ్యారు. ఆ తర్వాత చిలీకి షిఫ్ట్ అయిన జెంగ్ కరోనా సమయంలో మళ్లీ ఆడాలని నిర్ణయించుకుని ఆ దేశం తరఫున రీఎంట్రీ ఇచ్చారు.<<-se>>#Olympics2024<<>>
Similar News
News December 28, 2025
90 పైసలకే 50 ఎకరాలా: పేర్ని నాని

AP: చంద్రబాబు నోట PPP, P4 మాటలే వస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పీపీపీ టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే వారు వ్యాపారం మాత్రమే చేస్తారనే విషయాన్ని మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలో భూములు దోచుకుంటున్నారని, 90 పైసలకే 50 ఎకరాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సామాన్యులు, పేదల పట్ల చంద్రబాబు దృక్పథం మారట్లేదన్నారు.
News December 28, 2025
మిరపలో ఆకు ముడత తెగులు – లక్షణాలు

మిరపసాగులో ఆకుముడత తెగులు గతంలో తామర పురుగులు, పేను, దోమ వలన వచ్చేది. నేడు వీటితో పాటు జెమినీ వైరస్, మొజాయిక్ వైరస్లు కూడా ఈ ముడత తెగులు పురుగుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై, లేత పసుపు రంగుకు మారతాయి. ఆకులు పైకి ముడుచుకొని, రెమ్మలు గిడసబారుతాయి. మొక్కలు బలహీనపడి, పూత, పిందె సరిగా కట్టవు. దీనివల్ల పంట పెరుగుదలకు నష్టం వాటిల్లి, దిగుబడి తగ్గుతుంది.
News December 28, 2025
భారీ జీతంతో ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

<


