News October 28, 2025
సాగునీటి ప్రాజెక్టుల సేఫ్టీపై నివేదికలివ్వండి: రేవంత్రెడ్డి

TG: ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రి CR పాటిల్ రాసిన లేఖపై CM రేవంత్రెడ్డి అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుల భద్రతపై తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేశారు. లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులతో పాటు అన్ని డ్యాములపై నివేదికలివ్వాలని ఆదేశించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల రిపేర్లు చేయించాలని, వీటి బాధ్యత ఆయా ఏజెన్సీలే వహించేలా చూడాలన్నారు. NOV 2వ వారంలో మరోసారి సమీక్షిస్తానని సీఎం తెలిపారు.
Similar News
News October 29, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 29, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 29, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 29, 2025
తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం: CM

AP: తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని CM CBN అన్నారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని, స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.


