News July 30, 2024
మినిమమ్ బ్యాలెన్స్ ఫైన్.. ₹8500 కోట్లు పొందిన PSBలు

అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు బ్యాంకులు జరిమానా విధిస్తుంటాయి. 2020-2024 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSB) పెనాల్టీ ద్వారా రూ.8500 కోట్లు పొందినట్లు లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. FY2023-24లో అధికంగా రూ.2331 కోట్లు పెనాల్టీల రూపంలో PSBలు పొందాయి. 2020 తర్వాత అతిపెద్ద బ్యాంకు SBI దీనిని తొలగించినప్పటికీ ఇతర బ్యాంకుల వసూళ్లు 34% పెరగడం గమనార్హం.
Similar News
News October 16, 2025
రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు: TPCC చీఫ్

ఈ నెల 18న BC సంఘాలు చేపట్టే తెలంగాణ బంద్కు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రిజర్వేషన్లపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే బంద్కు BRS, BJP, మావోయిస్టు పార్టీలు సపోర్ట్ తెలపగా తాజాగా అధికార పక్షమూ మద్దతు ప్రకటించింది. దీంతో ఎల్లుండి బంద్ ప్రభావం సంపూర్ణంగా ఉంటుందని స్పష్టమవుతోంది. విద్యాసంస్థలకు యాజమాన్యాలు రేపు చెప్పే అవకాశముంది.
Share It
News October 16, 2025
ఇస్రో షార్లో 141 పోస్టులకు నోటిఫికేషన్

ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 141 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నీషియన్, సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నేటి నుంచి NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ, BSc, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, BLSc, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18- 35ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://www.isro.gov.in/
News October 16, 2025
‘ఓటుకు నోటు’ కేసు విచారణ వాయిదా

‘ఓటుకు నోటు‘ కేసు నిందితులు రేవంత్, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 3కి వాయిదా వేసింది. రేవంత్పై ఏసీబీ నమోదు చేసిన కేసు చట్టవిరుద్ధమని నిన్న ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఏసీబీ చట్టం ప్రకారం లంచం తీసుకోవడమే నేరమని వాదించారు. గురువారం కూడా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తులు మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ కేసు విచారించారు.