News February 27, 2025

సీఎం చంద్రబాబును కలిసిన పీటీ ఉష

image

AP: సీఎం చంద్రబాబును భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష కలిశారు. వెలగపూడిలోని సచివాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణకు సంబంధించి వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీఎం తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు.

Similar News

News November 21, 2025

అనకాపల్లి: వ్యాధినిరోధక టీకాలు వేయాలి

image

గర్భిణీలు బాలింతలు పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వీరజ్యోతి సూచించారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో వైద్యారోగ్యశాఖ సిబ్బందికి శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే వ్యాధి నిరోధక టీకాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే నెల 21న నిర్వహించే పల్స్ పోలియోపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.

News November 21, 2025

రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

News November 21, 2025

రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.