News February 13, 2025

PUలో 20న మేధో సంపతి హక్కుల సదస్సు

image

ఈనెల 20న  పాలమూరు యూనివర్సిటీలో “ఇంటర్నల్ క్వాలిటీ అస్సూరెన్సు సెల్” (IQAC) ఆధ్వర్యంలో మేదోసంపతి హక్కులు- డిజిటల్ శకం అనే అంశంపై జరిగే ఒరియంటేషన్ బ్రోచర్‌ను ఉపకులపతి ఆచార్య జి.ఎన్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా డాక్టర్ శంకర్ రావు ముంజం హాజరుకానున్నారు. రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్ప, ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 

Similar News

News September 19, 2025

71ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేసిన వృద్ధురాలు

image

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కేరళకు చెందిన 71 ఏళ్ల లీలా జోస్ నిరూపించారు. ఇడుక్కి జిల్లా, కొన్నతడికి చెందిన లీలకు స్కైడైవింగ్ చేయాలని కోరిక. తాజాగా దుబాయ్ వెళ్లిన ఆమె అనుభవజ్ఞుడైన శిక్షకుడితో కలిసి 13,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేశారు. కేరళలో ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. ‘గాల్లో తేలిపోతున్నప్పుడు భయం, ఆనందం రెండూ కలిగాయి.’ అని లీల తన అనుభవాన్ని వివరించారు.

News September 19, 2025

భారత్‌ను ఓడించిన కివీసే మా స్ఫూర్తి: WI కోచ్

image

భారత్‌లో ఆడే టెస్ట్ సిరీస్‌లో రాణించేందుకు న్యూజిలాండ్‌ను స్ఫూర్తిగా తీసుకుంటామని వెస్టిండీస్ కోచ్ డారెన్ సమీ అన్నారు. ‘గత ఏడాది ఇండియాలో NZ 3-0 తేడాతో సిరీస్ గెలిచింది. గెలిచేందుకు 20 వికెట్లు తీయాలి. మా పేసర్లకు ఆ సత్తా ఉంది. గెలవాలనే మైండ్ సెట్‌తోనే ఇండియా టూరుకు వెళ్తాం’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. IND, WI మధ్య అక్టోబర్ 2 నుంచి తొలి టెస్ట్, 10 నుంచి రెండో టెస్ట్ జరగనుంది.

News September 19, 2025

కోటబొమ్మాళి: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

image

కోటబొమ్మాళి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు శుక్రవారం తెలిపారు. మృతుడికి సుమారు 50 ఏళ్లు ఉంటాయన్నారు. వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ స్టేషన్‌‌‌కు తెలపాలన్నారు. 9492250069 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.