News December 19, 2024
PU: ‘ప్రపంచీకరణలో ఇంగ్లీష్ అందరికీ అవసరం’

ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లభాష ప్రతి ఒక్కరికి అవసరమని పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీనివాస్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన ఆంగ్ల భాష ఔన్నత్యంపై ఒకరోజు సెమినార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో ఆంగ్ల భాషకు ఎనలేని ప్రాముఖ్యత ఏర్పడిందని వెల్లడించారు.
Similar News
News January 4, 2026
MBNR: ఊళ్లకు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.!

సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని కోరారు. విలువైన నగలు, నగదును బీరువాల్లో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
News January 4, 2026
జడ్చర్ల: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

జడ్చర్ల మండలంలోని ఒక గ్రామంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. వారం క్రితమే అనారోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 4, 2026
జడ్చర్ల: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

జడ్చర్ల మండలంలోని ఒక గ్రామంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. వారం క్రితమే అనారోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


