News April 13, 2024
PU పరిధిలో ఎంఈడీ పరీక్ష రీషెడ్యూల్

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఈనెల 16న జరగాల్సిన ఎంఈడీ పరీక్షను రీషెడ్యూల్ చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. మహనీయుల జయంతి నేపథ్యంలో 16న జరిగే ఎంఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష 26న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు ఉంటుందని విద్యార్థులు గమనించాలని కోరారు.
Similar News
News September 12, 2025
MBNR: OCT 16న PUలో స్నాతకోత్సవం

పాలమూరు యూనివర్సిటీలో వచ్చేనెల 16న 4వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి కె.ప్రవీణ Way2Newsతో తెలిపారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ కోర్స్లలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు అన్ని కోర్సుల్లో 88 గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. ఈ స్నాతకోత్సవనికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరుకానున్నారు. యూనివర్సిటీలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి.
News September 12, 2025
MBNR: అడ్డాకులలో అత్యధిక వర్షపాతం నమోదు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో మహబూబ్నగర్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా అడ్డాకుల 23.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. చిన్నచింతకుంట 23.3, బాలానగర్ 15.3, మిడ్జిల్ 13.3, హన్వాడ 11.0, మహమ్మదాబాద్ 10.8, కౌకుంట్ల 7.3, సల్కర్ పేట 7.3, భూత్పూర్ 6.3, నవాబుపేట 6.0 మిల్లీమీటర్ల వర్షం రికార్డు అయింది.
News September 11, 2025
జడ్చర్ల: ఎరువు విక్రయ కేంద్రాల తనిఖీ

జడ్చర్ల మండలంలో ఎరువుల విక్రయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా బస్తాలను సమయానికి, పారదర్శకంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. రైతులకు ఎరువుల పంపిణీ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.