News July 7, 2024

PU: 15లోగా పీజీ పరీక్ష ఫీజు చెల్లించండి

image

పాలమూరు యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న పీజీ కశాశాల ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ 4వ సెమిస్టర్ పరీక్ష ఫీజును ఈనెల 15 వరకు చెల్లించాలని పీయూ పరీక్షల నిర్వహణ అధికారి డాక్టర్ రాజ్ కుమార్ శనివారం తెలిపారు. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు కూడా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 15లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని అన్నారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

Similar News

News February 26, 2026

మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఖుష్బూ గుప్త

image

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్‌గా సేవలందించిన విజయేందిర బదిలీ కావడంతో, ప్రభుత్వం ఖుష్బూ గుప్తకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. గతంలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేసిన ఆమె, జిల్లా అభివృద్ధిపై తనదైన ముద్ర వేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

News February 25, 2026

జడ్చర్ల: అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రం తారుమారు

image

జడ్చర్ల పట్టణంలోని ఓ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థికి సంస్కృతం సబ్జెక్టు పేపర్‌కు బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. పరీక్ష తొందరలో విద్యార్థి తనకు తోచిన జవాబులు రాశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి కళాశాలకు వెళ్లి అధికారులను ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 25, 2026

పాలమూరు:టెన్త్ పరీక్షలు..13,217 మంది విద్యార్థులు

image

మహబూబ్ నగర్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో రెగ్యులర్, ప్రయివేట్ విద్యార్థులు మొత్తం కలుపుకొని 13,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. పరీక్ష కేంద్రం పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ విధించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.