News January 3, 2025

రైలు పట్టాలపై పబ్‌జీ.. ముగ్గురు యువకుల మ‌ృతి

image

పబ్‌జీ ఆట పిచ్చి బిహార్‌లో ముగ్గురు టీనేజీ యువకుల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్‌జీ ఆడుతున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు. వారిపైనుంచి రైలు వెళ్లిపోయింది. దీంతో అందరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Similar News

News February 7, 2026

ఇంట్లో నుంచే LPG కనెక్షన్‌కి ఆధార్ లింక్..!

image

LPG & ఉజ్వల గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఆధార్ e-KYCని పూర్తి చేయాలని కేంద్ర సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే 75% మంది ఈ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపింది. మిగిలినవారు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫ్రీగా KYC చేసుకోవచ్చు. ఈ <>వెబ్‌సైట్‌లో<<>> ఏజెన్సీ, KYC యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 18002333555కు కాల్ చేయండి.

News February 7, 2026

సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ చెయ్యొచ్చా?

image

మొదటిసారి సిజేరియన్‌ చేసి బిడ్డను తీస్తే, రెండోసారి ప్రసవంలోనూ సిజేరియన్‌ తప్పదని చాలామంది భావిస్తారు. అయితే సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ చేయొచ్చంటున్నారు నిపుణులు. కానీ మొదటి డెలివరీ ఎలా జరిగింది, ఎలాంటి కాంప్లికేషన్లు వచ్చాయి, బిడ్డ బరువు, తల్లి ఆరోగ్యం, రెండు డెలివరీలకు మధ్య గ్యాప్‌పై ఆధారపడి ఉంటుంది. రెండో డెలివరీ నార్మల్ అవ్వాలంటే ముందుగా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

News February 7, 2026

ఎల్లుండి ఢిల్లీకి సీఎం.. సర్వత్రా ఉత్కంఠ

image

AP: ఈ నెల 9న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ పర్యటనలో కేంద్రప్రభుత్వ పెద్దలతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.