News June 18, 2024

రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది: భువనేశ్వరి

image

AP: రాష్ట్రంలో హింసాత్మక పాలన పోయి ప్రజాపాలన మొదలైందని CM చంద్రబాబు భార్య భువనేశ్వరి అన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్న సంతోషంలో ఉన్నారని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశా. వారి బాధలు విని, సమస్యలు తెలుసుకున్నా. కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రజాపాలన అందిస్తుంది. ఇకపై రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది’ అని ఆమె పేర్కొన్నారు.

Similar News

News April 6, 2026

గ్యాస్ కొరతపై రాహుల్ ఫైర్

image

వంట గ్యాస్ కొరతపై రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. కరోనా కష్టకాలాన్ని మోదీ ప్రభుత్వం ఎలాగైతే గాలికొదిలేసిందో ఇప్పుడు గ్యాస్ సంక్షోభాన్నీ అలాగే హ్యాండిల్ చేస్తోందన్నారు. ప్రకటనలకే పరిమితమవుతూ పేదలను ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు. రోజూ ₹500-800 సంపాదించే కూలీలకు గ్యాస్ అందనంత దూరమైందన్నారు. దీనివల్ల కార్మికులు నగరాలను వదిలి గ్రామాలకు వెళ్తున్నారని, పరిశ్రమలు నష్టపోతున్నాయన్నారు.

News April 6, 2026

ప్చ్.. ఇంకా IPL ఆడాల్సింది: అశ్విన్

image

IPLలో వరుసగా 3 మ్యాచుల్లో CSK ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ ప్లేయర్ అశ్విన్ నిరాశ వ్యక్తం చేశారు. గత సీజన్‌లోనే రిటైర్మెంట్ ప్రకటించి ఉండాల్సింది కాదని వాపోయారు. జట్టుపై నమ్మకంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని, లేదంటే ఈ సీజన్ కూడా ఆడేవాడినని పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్‌కు ఇబ్బంది కలగొద్దని, తన వల్ల ఫ్రాంచైజీకి ₹10 కోట్లు మిగులుతాయనే భావించానన్నారు. మానసిక అలసట వల్లే గుడ్‌బై చెప్పాల్సి వచ్చిందని వివరించారు.

News April 6, 2026

భూమధ్య రేఖ, కర్కాటక రేఖ కలుస్తాయా.. అదెలా సర్?

image

ఉజ్జయినిలో భూమధ్య రేఖ, కర్కాటక రేఖ కలుస్తాయంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2 వేర్వేరు అక్షాంశాల్లో ఉండే లైన్స్ ఎలా కలుస్తాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘భూమధ్య రేఖ(Equator), కర్కాటక రేఖ(Tropic of Cancer).. సమాంతర రేఖలు. అవి కలవవు. మీరు BJPకి ఓటు వేస్తే విద్యావ్యవస్థను తీర్చిదిద్దేది ఇలాంటి వ్యక్తులే’ అని TMC నేత సాకేత్ గోఖలే ఎద్దేవా చేశారు.