News November 21, 2024
డిసెంబర్ 3న ప్రజాపాలన బహిరంగ సభ?

TG: ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 3న ప్రజాపాలన బహిరంగ సభ నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగే ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల్లో ఒకరిని ఆహ్వానించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు నామినేటెడ్ పదవులు, పలు కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీపై నిన్న పార్టీ కీలక నేతలతో సీఎం చర్చించినట్లు సమాచారం.
Similar News
News October 22, 2025
మీ విషెస్కు థాంక్స్ ట్రంప్: మోదీ

దీపావళి సందర్భంగా విష్ చేసిన US అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘మీ ఫోన్ కాల్కు థాంక్స్. ఈ పండుగ నాడు మన రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ప్రకాశింపజేయడాన్ని కొనసాగించాలి. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి’ అని పేర్కొన్నారు. కాగా 2 దేశాల మధ్య వాణిజ్యం గురించి <<18068579>>మోదీతో మాట్లాడినట్లు<<>> ట్రంప్ తెలిపారు. వైట్హౌస్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
News October 22, 2025
విష్ణు వామనావతారం ఎందుకు ఎత్తాడు?

దానశీలి బలి చక్రవర్తి అపారమైన యాగబలంతో ఇంద్ర పదవిని ఆక్రమించి 3 లోకాలపై ఆధిపత్యాన్ని సాధించాడు. ఇది లోకాల సమతుల్యతను దెబ్బతీయడంతో పాటు దేవతల్లో ఆందోళన పెంచింది. అందుకే విష్ణువు, బలి దానగుణాన్ని గౌరవిస్తూనే, అతని అహంకారాన్ని అణచడానికి, లోకాలను రక్షించడానికి వామనుడి రూపంలో వచ్చాడు. కేవలం మూడడుగుల నేల అడిగి, బలిని పాతాళానికి పంపాడు. సద్గుణాలకు మెచ్చి ఆ లోకానికి రాజుగా చేసి, ధర్మాన్ని నిలబెట్టాడు.
News October 22, 2025
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 76,343 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 18,768 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.4.34 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.