News July 16, 2024

తగ్గేదేలే అంటున్న పబ్లిక్ సెక్టార్ స్టాక్స్!

image

దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రభుత్వ రంగ సంస్థల (సుమారు 55 కంపెనీలు) షేర్లు దూసుకెళ్తున్నాయి. జూన్ 4 నుంచి దాదాపు నెల రోజుల వ్యవధిలో వీటి సంపద ₹12లక్షల కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాప్ ₹22.5లక్షల కోట్లకు చేరింది. కేంద్ర విధానాలు PSUలకు సానుకూలంగా ఉంటాయనే ధీమా ఈ జోరుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మజగావ్ డాక్, ఆయిల్ ఇండియా, కొచ్చిన్ షిప్‌యార్డ్ వంటి షేర్లు 25-50% మధ్య వృద్ధిని నమోదు చేశాయి.

Similar News

News November 16, 2025

తీవ్ర గాయం.. ఐసీయూలో శుభ్‌మన్ గిల్?

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్యాటింగ్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ <<18294780>>మెడనొప్పితో<<>> బాధపడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ చేయలేక మైదానాన్ని వీడి వెళ్లారు. అయితే అది తీవ్రం కావడంతో గిల్‌ను అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచినట్లు తెలుస్తోంది. మెడకు సర్వైకల్ కాలర్‌తో స్ట్రెచర్‌పై తీసుకెళ్లడంతో ఆయనకు సివియర్ ఇంజురీ అయిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

News November 16, 2025

BBCని వదలని ట్రంప్

image

మీడియా సంస్థ BBC, US అధ్యక్షుడు ట్రంప్ మధ్య వివాదం ముగిసేలా కనిపించడం లేదు. ఆయన మాట్లాడిన వీడియోను తప్పుగా ఎడిట్ చేసినందుకు BBC ఇప్పటికే <<18281054>>క్షమాపణ<<>> చెప్పింది. అయినా ఆయన వదలడం లేదు. 5 బిలియన్ డాలర్ల వరకు దావా వేస్తానని ట్రంప్ ప్రకటించారు. తాను అనని మాటలను అన్నట్లు తప్పుగా ప్రసారం చేశారని, నష్టపరిహారం చెల్లించడానికి నిరాకరించారని మండిపడ్డారు. త్వరలోనే బ్రిటన్ PM స్టార్మర్‌తో మాట్లాడతానని చెప్పారు.

News November 16, 2025

ఈరోజు వీటిని తినకూడదట.. ఎందుకంటే?

image

కార్తీక మాసంలో ఆదివారం రోజున ఉసిరి, కొబ్బరిని ఆహారంగా తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘ఉసిరి చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. విష్ణు కొలువై ఉండే వృక్షంగా దీన్ని భావిస్తారు. కొబ్బరి కూడా పవిత్రమైన పూజా ద్రవ్యం. సూర్యభగవానుడికి అంకితమైన ఈ ఆదివారం రోజున ఈ పవిత్ర వృక్షాలను గౌరవించాలి. వాటి ఫలాలను ఆహారంగా స్వీకరించడం ధర్మం కాదని గ్రహించాలి. ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి’ అని సూచిస్తున్నారు.