News June 4, 2024
ప్రజా తీర్పు-24: గెలిచినా ఓటమే, ఓడినా గెలుపే

ఈసారి దేశ ఓటర్లు ఇరుపక్షాలకు విచిత్ర తీర్పు ఇచ్చారు. వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న NDA కౌంట్ 300 లోపే ఆగింది. మ్యాజిక్ ఫిగర్ 272 దాటినా, సొంతంగా 400 సీట్లు గెలుస్తామన్న BJPకి ఈ తీర్పు ఓ పాఠం. 2014, 19 ఘన విజయాలతో పోలిస్తే ఈ ఫలితం ఓ రకంగా ఓటమే. పదేళ్లుగా పరాభవం చూసిన కాంగ్రెస్ సొంతంగా 100+ MP స్థానాలు గెలిచింది. INDIA కూటమి 233 సీట్లతో అధికారానికి ఒక్క అడుగు ముందు ఆగినా నైతికంగా వారికిది విజయమే.
Similar News
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.
News December 10, 2025
ఉప్పల్లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.


