News July 31, 2024
రైల్వే ట్రాక్స్పై పూజలు.. ఎందుకంటే?

ముంబైలోని చెంబూర్ స్టేషన్ సమీపంలో గల రైల్వే ట్రాక్పై కొబ్బరి కాయలు కొడుతూ భక్తులు పూజలు చేస్తున్నారు. ఇది ప్రమాదకరమని ఓ వ్యక్తి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయడంతో భక్తులను అక్కడి నుంచి పంపించేశారు. అయితే, అక్కడ ఎందుకు పూజలు చేస్తున్నారని ఓ భక్తుడిని ప్రశ్నించగా.. గతంలో ఇక్కడే ఆలయం ఉండేదని, అప్పటి నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నామని భక్తులు RPF సిబ్బందికి తెలిపారు.
Similar News
News April 7, 2026
IPL: ఢిల్లీకి షాక్.. మరో 3 మ్యాచ్లకు స్టార్క్ దూరం!

ఢిల్లీ క్యాపిటల్స్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ మరో 3 మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఆయన భుజం, మోచేయి సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా బోర్డు అనుమతిస్తే ఈ నెల 21న SRHతో మ్యాచ్ నాటికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపాయి. కాగా ఈ ఏడాది తొలి రెండు మ్యాచ్లను DC గెలిచిన విషయం తెలిసిందే.
News April 7, 2026
Alert: పాలిసెట్కు అప్లై చేసుకున్నారా?

తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు పాలిసెట్-2026కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏపీలో ఈ నెల 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఏప్రిల్ 25న పరీక్ష జరగనుంది. సైట్: https://polycetap.ap.gov.in/. అటు తెలంగాణలో పాలిసెట్ అప్లికేషన్ గడువు ఏప్రిల్ 20తో ముగియనుంది. మే 13న ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్ష పూర్తైన 12 రోజులకు ఫలితాలు వెల్లడిస్తారు. polycet.sbtet.telangana.gov.in/
News April 7, 2026
లోపాలను వీడి.. లోకాన్ని ఎదిరించి

ప్రేమకు కళ్లు లేవంటారు. కానీ స్వచ్ఛమైన మనసుంటుందని నిరూపించారు మచిలీపట్నానికి చెందిన షేక్ గౌసియా(19). మతం వేరైనా, తన బాల్య మిత్రుడు శశి(23) మరుగుజ్జుగా ఉన్నా అతణ్నే ప్రాణంగా ప్రేమించారు. పెద్దలు నిరాకరించినా చర్చిలో అతడితో చేతులు కలిపారు. అందం, అంతస్తు కంటే అనురాగమే మిన్న అని చాటిన వీరు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. సమాజం చూసే చూపు కంటే తోడుండే మనసే గొప్పదంటున్న వీరి కథ అందరినీ కదిలిస్తోంది.


