News October 9, 2024
ఎస్సీ వర్గీకరణ అమలు కోసం పూజలు: డొక్కా

AP: వైసీపీ తప్ప రాజకీయ పార్టీలన్నీ ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తున్నాయని TDP నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వం కుల గణన చేసినా వివరాలు వెల్లడించలేదని విమర్శించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును కూటమి ప్రభుత్వం ఆహ్వానించిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఈ నెల 11న దుర్గామాత ఆలయాల్లో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో గవర్నర్, మంత్రులు, అఖిలపక్ష నేతలను కలుస్తామని అన్నారు.
Similar News
News December 15, 2025
దువ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

దువ్వూరులోని మురళి నగర్ మెట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సొంత పనులు కోసం నడుచుకుంటూ వెళుతున్న వీర ప్రతాపరెడ్డి, ఎల్లయ్య అనే వ్యక్తులను ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లయ్యది నేలటూరు కాగా, వీర ప్రతాప్ రెడ్డిది గోపులాపురంగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
News December 15, 2025
దేశానికి త్వరలో కొత్త ప్రధాని: పృథ్వీరాజ్

మహారాష్ట్ర మాజీ సీఎం, INC నేత పృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి త్వరలో కొత్త PM రాబోతున్నారని జోస్యం చెప్పారు. ఆయన మరాఠీ వ్యక్తే కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఇటీవల SMలో తాను చేసిన పోస్టుపై స్పందిస్తూ ‘ప్రపంచ స్థాయిలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మార్పులు జరగొచ్చు. బీజేపీ మహారాష్ట్ర నుంచి కొత్త వ్యక్తికి ప్రధానిగా అవకాశం ఇవ్వొచ్చు. నా ప్రకటన ఊహాజనితమే’ అని పేర్కొన్నారు.
News December 15, 2025
24 ఏళ్ల వయసులో రూ.2.50 కోట్ల టర్నోవర్

ఒక స్టార్టప్తో 10 వేల మంది రైతులకు అండగా నిలుస్తున్నారు బిహార్కు చెందిన 24 ఏళ్ల ప్రిన్స్ శుక్లా. రైతుల కష్టాలను చూసి చలించిన అతడు తండ్రి నుంచి రూ.లక్ష తీసుకొని ‘AGRATE’ సంస్థ స్థాపించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్, ఎరువులు, ఆధునిక శిక్షణ ఇస్తూ ఉత్పత్తులకు మంచి మార్కెట్ కల్పించడంతో వారి ఆదాయం పెరిగింది. ప్రస్తుతం AGRATE టర్నోవర్ రూ.2.5 కోట్లు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


