News September 25, 2024

ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలి: YS జగన్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత YS జగన్ పిలుపునిచ్చారు. ‘తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారు. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు చేయాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 15, 2025

2800 MW విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి

image

AP: రాష్ట్రంలో 2800 MW విద్యుదుత్పత్తి ప్లాంట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం GOలు జారీచేసింది. మన్యం(D) మక్కువ(M) దుగ్గేరులో 2000MW హైడ్రో ప్రాజెక్టు కోసం ‘చింతా గ్రీన్ ఎనర్జీ’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం(D) కమలపాడు, కొనకొండ్ల, గుల్లపాలెంలో ‘ACME ఊర్జా’, బెళుగుప్ప(M)లోని 4 గ్రామాల్లో ‘TATA’ 400MW చొప్పున సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఓకే చెప్పింది. వీటికి భూమి ఇతర రాయితీలను GOల్లో పొందుపర్చారు.

News October 14, 2025

ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ సెమీస్ వెళ్లాలంటే?

image

SA, AUS చేతిలో ఓడిపోయిన టీమ్ఇండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నెక్ట్స్ ఈనెల 19న ENG, 23న NZ, 26న బంగ్లాతో తలపడనుంది. బంగ్లా మినహా ENG, NZపై భారత రికార్డు పేలవంగా ఉంది. కానీ వీటితో చివరగా జరిగిన సిరీస్‌ల్లో INDనే పైచేయి(2-1) సాధించింది. లీగ్‌లో మిగిలిన 3 మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్లే అవకాశముంది. లేదంటే కనీసం 2 గెలిచి, మెరుగైన NRR మెయింటెన్ చేస్తే క్వాలిఫై అవ్వొచ్చు.

News October 14, 2025

జగన్ ఆస్తుల వివాదం.. స్టేటస్ కో విధించిన NCLT

image

YS జగన్‌కు చెందిన సరస్వతి సిమెంట్స్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. జులై 29న హైదరాబాద్ NCLT బెంచ్ జగన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. జగన్ తల్లి, చెల్లెలి పేరిట రాసిన గిఫ్ట్ డీడ్‌లో షేర్లు పూర్తిగా బదిలీ కాలేదని, అందువల్ల అవి జగన్ వద్దే ఉన్నట్లు తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ విజయమ్మ చెన్నై బెంచ్‌లో అప్పీల్ చేయగా దానిపై స్టేటస్ కో విధించింది.