News September 25, 2024
ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలి: YS జగన్
AP: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత YS జగన్ పిలుపునిచ్చారు. ‘తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారు. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు చేయాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 25, 2024
AIతో భయం వద్దు: OpenAI CEO ఆల్ట్మాన్
జాబ్ మార్కెట్పై AI ప్రభావం చూపుతుందని నమ్ముతున్నట్టు OpenAI CEO సామ్ ఆల్ట్మాన్ పేర్కొన్నారు. అయితే కొంతమంది భయపడినంత త్వరగా లేదా తీవ్రంగా ప్రభావం చూపబోదన్నారు. ఆకస్మికంగా ఉద్యోగాలేమీ పోవన్నారు. AI కార్మిక మార్కెట్లను సానుకూలంగా, ప్రతికూలంగా మార్చగలదని ఓ బ్లాగ్ పోస్ట్లో పంచుకున్నారు. అనుకున్నదానికంటే నెమ్మదిగా ఉద్యోగాల తీరు మారుతుందని, మనం చేయాల్సిన పనులు అయిపోతాయనే భయం లేదని పేర్కొన్నారు.
News September 25, 2024
టాప్-5లో ఉన్న ఏకైక బ్యాటర్ ఇతడే..
టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్లో అదరగొడుతున్నారు. ప్రస్తుతం టెస్టులు, టీ20ల్లో టాప్-5లో ఉన్న ఏకైక ఇంటర్నేషనల్ బ్యాటర్ ఇతడే. జైస్వాల్ టీ20ల్లో 4, టెస్టుల్లో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. వన్డేల్లోనూ అవకాశాలు లభిస్తే అందులోనూ తన మార్క్ చూపించే అవకాశాలు ఉన్నాయి.
News September 25, 2024
30 కాదు 59 ముక్కలు.. మహిళ హత్య కేసులో కీలక విషయాలు
బెంగళూరులో 29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను 30 ముక్కలుగా <<14164043>>నరికిన<<>> కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వైద్య నివేదికల ప్రకారం 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో పెట్టినట్లు తెలుస్తోంది. గతేడాది భర్తతో విడిపోయిన మహాలక్ష్మి తాను పనిచేస్తున్న మాల్లో టీమ్ లీడర్గా ఉన్న రంజన్తో రిలేషన్లో ఉందని పోలీసులు తెలిపారు. అయితే మహాలక్ష్మి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం తెలిసి రంజన్ హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నారు.