News June 21, 2024
పుణే యాక్సిడెంట్.. నిందితుడి తండ్రికి బెయిల్

పుణేలో కారుతో ఢీకొట్టి ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందితుడి(17) తండ్రి విశాల్ అగర్వాల్కు బెయిల్ మంజూరైంది. మే 19న మద్యం మత్తులో కారును అతివేగంతో నడిపిన ఆ బాలుడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతికి కారణమయ్యాడు. కాగా తమ కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు బ్లడ్ శాంపిల్స్ మార్చారనే కారణంతో తండ్రి విశాల్ అగర్వాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పుణేలోని సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Similar News
News November 22, 2025
ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు ఇస్తాం: మంత్రి తుమ్మల

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి రూ.10 లక్షల గ్రాంటు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లోపు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అర్హులైన ప్రతి మహిళకు వద్దకు వెళ్లి, బొట్టు పెట్టి ఇందిరమ్మ చీరలను అందించాలని సూచించారు.
News November 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 74

ఈరోజు ప్రశ్న: వేంకటేశ్వరస్వామి ద్వార పలుకులు అయిన జయవిజయులు తర్వాతి మూడు జన్మలలో అసురులుగా ఎందుకు జన్మించారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 22, 2025
26న ‘స్టూడెంట్ అసెంబ్లీ’.. వీక్షించనున్న సీఎం

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అసెంబ్లీ ఆవరణలో ‘స్టూడెంట్ అసెంబ్లీ’ నిర్వహించనున్నారు. ఇందుకోసం 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. కొందరు స్పీకర్, Dy.స్పీకర్, CM, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారు. మిగతా విద్యార్థులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తారు. రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని CM CBN, మంత్రులు వీక్షించనున్నారు.


