News August 27, 2024
50 రోజుల్లో శిక్ష విధించాలి: TMC MP

దేశంలో అత్యాచార ఘటనలకు సంబంధించి 26% కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయని TMC MP అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో 50 రోజుల్లో విచారణ జరిపి శిక్ష అమలు చేసేలా యాంటీ రేప్ లా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి 100 కేసుల్లో 26 మందే శిక్షలు అనుభవిస్తున్నారని, 74 మంది తప్పించుకుంటున్నారని వివరించారు. దేశంలో గత 15 రోజుల్లో మహిళలపై 24 రేప్, దాడుల ఘటనలు జరిగాయని పలు కథనాలను Xలో పోస్ట్ చేశారు.
Similar News
News December 12, 2025
కర్నూలు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్గా నాగేంద్ర

తుగ్గలి గ్రామానికి చెందిన తుగ్గలి నాగేంద్రను కర్నూలు జిల్లా గ్రంధాలయ ఛైర్మన్గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్కు నాగేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
News December 12, 2025
జపాన్లో మళ్లీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్లో వరుస <<18509568>>భూకంపాలు<<>> ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇవాళ 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర పసిఫిక్ తీరప్రాంతంలో సునామీ అలలు మీటర్ ఎత్తులో ఎగసిపడొచ్చని హెచ్చరించారు. కుజి నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. కాగా నాలుగు రోజుల కిందట ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపానికి పలు ఇళ్లు బీటలు వారగా 50 మంది గాయపడ్డారు.
News December 12, 2025
బస్సు ప్రమాదంపై PM దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

AP: అల్లూరి జిల్లా బస్సు <<18539495>>ప్రమాదంలో<<>> ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కాగా ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.


