News November 26, 2024
మినీ ఆస్ట్రేలియాగా మారిన పంజాబ్

IPL-2025 రిటెన్షన్స్, మెగా వేలంతో కలిపి పంజాబ్ కింగ్స్ 25 మందిని కొనుగోలు చేసింది. ఐదుగురు ఆసీస్ ప్లేయర్లను తీసుకుంది. జట్టు: శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, ఇంగ్లిస్, హార్డీ, బార్ట్లెట్, అర్ష్దీప్, ప్రభ్ సిమ్రన్, వినోద్, వైశాఖ్, వధేరా, యశ్ ఠాకూర్, బ్రార్, హర్నూర్, షెడ్గే, పైలా, చాహల్, ముషీర్ ఖాన్, ప్రియాన్ష్ ఆర్య, ఫెర్గుసన్, జాన్సెన్, సేన్, ప్రవీణ్ దూబే, ఒమర్జాయ్.
Similar News
News March 7, 2026
‘బ్లూ స్పారో’తోనే ఖమేనీ మృతి!

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని చంపడానికి ఇజ్రాయెల్ ‘బ్లూ స్పారో’ మిస్సైల్ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇది 1900 కిలోల బరువు ఉంటుంది. సాధారణంగా మిస్సైళ్లు టార్గెట్స్ చేరేందుకు ఓ నిర్దిష్టమైన యాంగిల్లో ప్రయాణిస్తాయి. కానీ ఈ బ్లూ స్పారో ముందు దాదాపు అంతరిక్షానికి చేరి ఆపై నిటారుగా శబ్దం కంటే ఎన్నోరెట్లు వేగంతో లక్ష్యంవైపు దూసుకొస్తుంది. డిఫెన్స్ సిస్టమ్స్ కనిపెట్టేలోపే చేయాల్సిన నష్టం చేసేస్తుంది.
News March 7, 2026
భారత్ భద్రతలో సేఫ్గా ఇరాన్ షిప్

IRIS <<19299071>>దేనా<<>> దాడికి గురైన నేపథ్యంలో భారత్ ఆ నౌకకు ఆశ్రయం కల్పించాల్సిందనే విమర్శలు వచ్చాయి. కానీ నిజానికి భారత్ ఇరాన్కు సహకరిస్తూనే ఉంది. ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న IRIS లవన్ అనే మరో నౌక ఇప్పుడు కొచ్చి పోర్టులో సేఫ్గా ఉంది. ఇరాన్పై US దాడి చేసిన రోజునే (Feb 28) 183 మంది సిబ్బంది గల ఈ నౌక సంకేతిక సమస్యల వల్ల భారత్ సాయం కోరింది. దేనా విషయంలో కేంద్రానికి ఇరాన్ ఎలాంటి రిక్వెస్ట్ చేయనట్లు తెలుస్తోంది.
News March 7, 2026
మూడుసార్లూ కివీస్దే పైచేయి.. ఈసారి చెక్ పడాల్సిందే!

T20WC: ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడేందుకు భారత్ ఇంకో గెలుపు దూరంలో ఉంది. అయితే ప్రత్యర్థి న్యూజిలాండ్తో T20WC చరిత్రలో భారత్కు పేలవ రికార్డ్స్ ఉండటం చర్చనీయాంశమైంది. భారత్ NZతో ఆడిన మూడు మ్యాచుల్లోనూ (2007, 2016, 2021) కివీస్దే విజయం. ఈసారి ఆ జట్టు ఓపెనింగ్, ఫీల్డింగ్, స్పిన్ బలంగా ఉందని.. సెమీస్ తరహాలోనే భారత్ రాణించి కప్పు కొట్టాలని, ఆ స్ట్రీక్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


