News June 11, 2024

లోక్‌సభ స్పీకర్‌గా పురందీశ్వరి‌?

image

కీలకమైన లోక్‌సభ స్పీకర్‌ ఎంపికలో BJP వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలకు ఆ పదవి ఇవ్వడం BJPకి ఇష్టం లేదని, ఆ పార్టీ AP చీఫ్ పురందీశ్వరి‌కి స్పీకర్‌ బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమెకు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదనే మరో వాదన ఉంది. ఆమెకు ఇస్తే చంద్రబాబూ వ్యతిరేకించలేరనే టాక్ నడుస్తోంది. అయితే ఇందుకోసం నితీశ్(JDU)ను BJP ఒప్పించాల్సి ఉంటుంది.

Similar News

News September 11, 2025

రేపు Way2News కాన్‌క్లేవ్‌కు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు విజయవాడలో నిర్వహించే Way2News కాన్‌క్లేవ్‌కు హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి ఆయన ఇప్పటికే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆ కార్యక్రమం ముగించుకొని మ. 3గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా కాన్‌క్లేవ్‌కు రానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి రానున్న దశాబ్ద కాలంలో అవలంబించాల్సిన విధివిధానాల గురించి చర్చించనున్నారు.

News September 11, 2025

ఉత్తరాఖండ్‌కు రూ.1200 కోట్ల ఆర్థిక సాయం

image

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌కు ప్రధాని మోదీ రూ.1200 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇవాళ డెహ్రాడూన్ వెళ్లిన ప్రధాని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. అంతకుముందు పంజాబ్‌కు రూ.1600 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.1500 కోట్లు ప్రకటించారు.

News September 11, 2025

నా అంచనాలను అందుకొని బెస్ట్ ఇవ్వాలి: CBN

image

AP: ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఆయన మాట్లాడారు. ‘నా ఆలోచనలు, అంచనాలను అందుకొని, ఉత్తమ ప్రదర్శన చేయాలి. CM అంటే కామన్ మ్యాన్ అని చెబుతున్నా. మీరూ అదే పాటించాలి. అన్నింటికి రూల్స్‌తోనే కాకుండా మానవీయ కోణంలోనూ పనిచేయాలి. ఫేక్ ప్రచారాల పెను సవాళ్లను ఎదుర్కొంటూ రియల్ టైంలో స్పందించాలి. క్రియేటివ్, ఇన్నోవేటివ్ నిర్ణయాలు ఉండాలి’ అని తెలిపారు.