News September 23, 2024

కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా పురందీశ్వరి

image

ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందీశ్వరిని కేంద్ర ప్రభుత్వం కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆఫీసు ఉత్తర్వులు జారీ చేసింది. 2026 చివరి వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ ప్రతినిధిగా కూడా ఆమె నామినేట్ అయ్యారు.

Similar News

News December 5, 2025

స్క్రబ్ టైఫస్ వ్యాధి.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

image

స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే పురుగు పొలాలు, అడవులు, పశుగ్రాసం, తడి నేలల్లో ఎక్కువగా ఉంటోంది. పొలం పనులకు, పశుగ్రాస సేకరణకు వెళ్లే రైతులు తప్పనిసరిగా రబ్బరు బూట్లు, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తడిసిన దుస్తులు ధరించొద్దు. పొలాల్లో, పశువుల కొట్టాల్లో పనిచేసేటప్పుడు ఏదైనా పురుగు కుట్టి నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులుంటే ఆస్పత్రికి తప్పక వెళ్లండి.

News December 5, 2025

అవినీతి అధికారి గుట్టు రట్టు.. రూ.100కోట్లకు పైగా ఆస్తులు!

image

తెలంగాణ ACB మరో అవినీతి అధికారిని పట్టుకుంది. రంగారెడ్డి(D) సర్వే సెటిల్మెంట్&భూ రికార్డుల ఆఫీసులో ADగా పనిచేస్తున్న కొంతం శ్రీనివాసులుపై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. అతనికి HYDలో ఒక ఫ్లాట్, MBNRలో 4 ప్లాట్లు, NRPTలో రైస్ మిల్లు, 3 ప్లాట్లు, అనంతపురం, కర్ణాటకలో 22 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు 4 వీలర్ వాహనాలు, 1.6kgs బంగారం, 770gms వెండి ఉన్నట్లు గుర్తించింది. వీటి వాల్యూ ₹100Cr+ ఉంటుందని అంచనా.

News December 5, 2025

జుట్టు చివర్లు చిట్లుతున్నాయా..?

image

వాతావరణ మార్పుల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లడం ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానానికి మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. బయటకి వెళ్తున్నప్పుడు జుట్టంతా కప్పిఉంచుకోవాలి. తలస్నానం తర్వాత హెయిర్ సీరం వాడటం మంచిది. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయినా సమస్య తగ్గకపోతే ఒకసారి ట్రైకాలజిస్ట్‌లను సంప్రదించాలి.