News June 4, 2024

పురందీశ్వరికి 2 లక్షలు దాటిన మెజార్టీ

image

AP: ఎన్నికల్లో కూటమి రాజమండ్రి బీజేపీ అభ్యర్థి పురందీశ్వరికి ఇప్పటికే 2 లక్షల మెజార్టీ దాటింది. ప్రస్తుతం ఆమె 2,05,531 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక శ్రీకాకుళం, విశాఖ, అమలాపురం, విజయవాడ, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థులు లక్ష పైన మెజార్టీలతో కొనసాగుతున్నారు.

Similar News

News January 23, 2026

MBBS సీటు కోసం కాలును నరుక్కున్నాడు

image

దివ్యాంగుల కోటాలో మెడికల్ సీటు పొందేందుకు ఓ వ్యక్తి తన కాలును తానే నరుక్కున్నాడు. UPలోని జౌన్‌పూర్‌(D)కు చెందిన సూరజ్‌ భాస్కర్‌ (20) NEET పరీక్షలో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. దివ్యాంగుల కోటాలో అయితే ఈజీగా సీటు వస్తుందని భావించి కాలును నరుక్కుని దాడిలో కోల్పోయానంటూ నాటకమాడాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అతనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు న్యాయ సలహా కోరారు.

News January 23, 2026

ల్యాండ్ రికార్డులను బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటలైజ్ చేయాలి: SC

image

దేశంలో బలహీనమైన ల్యాండ్ రికార్డుల వ్యవస్థతో భూ వ్యాజ్యాలు పెరిగిపోతున్నాయని SC వ్యాఖ్యానించింది. ల్యాండ్ రికార్డులు ట్యాంపర్‌కు ఆస్కారం లేని విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటలైజ్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మోడ్రన్ ఎకానమీలో ప్రాపర్టీ టైటిల్స్ శాంక్టిటీతో ఉండాలని జస్టిసులు రాజేశ్ బిందాల్, మన్మోహన్ అభిప్రాయపడ్డారు. రిజిస్టర్డ్ డాక్యుమెంటు లాంఛనం కాదని ఓకేసులో పేర్కొన్నారు.

News January 23, 2026

టాస్ గెలిచిన భారత్

image

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. జట్టులో 2 మార్పులు జరిగాయి. అక్షర్, బుమ్రాకి రెస్ట్ ఇచ్చి వారి స్థానంలో కుల్దీప్, హర్షిత్ రాణాను తీసుకున్నారు.
IND: శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ సింగ్, హర్షిత్, అర్ష్‌దీప్, కుల్దీప్, వరుణ్.
NZ: కాన్వే, సీఫర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, సాంట్నర్, ఫౌల్క్స్, హెన్రీ, సోథీ, జాకబ్.