News October 31, 2024
రూ.21కోట్లకు పూరన్ రిటెన్షన్!

నికోలస్ పూరన్ IPL 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్తో టాప్ రిటెన్షన్ స్థానాన్ని పొందినట్లు వార్తలొస్తున్నాయి. పూరన్ను ఏకంగా రూ.21 కోట్లకు రిటెయిన్ చేసుకుందని, అతనికిదే కెరీర్లో అత్యధికమని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా పూరన్ కోల్కతాలో LSG ఓనర్ సంజీవ్ గోయెంకాతో సమావేశమైన తర్వాత రూ.18 కోట్లకు బదులు రూ.21 కోట్లు పొందినట్లు తెలుస్తోంది. ఇతర ఆటగాళ్ల ధరల్లోనూ స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం.
Similar News
News October 18, 2025
టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్త!

ఇవాళ్టి నుంచి దీపావళి టపాసుల మోత మోగనుంది. ఈ సందర్భంగా పిల్లలపై పెద్దలు ఓ కన్నేసి ఉంచడం మేలు. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో సింథటిక్ దుస్తులు కాకుండా కాటన్వి ధరించాలి. కాలికి చెప్పులు లేదా బూట్లు ధరించాలి. క్రాకర్స్ను చేతిలో పట్టుకుని కాల్చకుండా, సురక్షితమైన దూరం పాటించాలి. కాల్చిన లేదా సగం కాలిన టపాసులను ముట్టుకోకూడదు. వాటిపై నీరు పోసి పారేయాలి. గడ్డివాములు, గుడిసెల దగ్గర అస్సలు పేల్చకూడదు.
News October 18, 2025
68,900 అప్లికేషన్లు.. మరో 30 వేలు వచ్చే ఛాన్స్

TG: మద్యం దుకాణాలకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులకు ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కొన్ని జిల్లాల్లో దరఖాస్తుదారులు బారులు తీరారు. వారందరికీ అధికారులు టోకెన్లు ఇచ్చారు. ఇప్పటివరకు 68,900 అప్లికేషన్ల ద్వారా రూ.2,067 కోట్ల ఆదాయం వచ్చింది. మరో 30 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఆదాయం రూ.3 వేల కోట్లు దాటనుంది. గతంలో 1.03 లక్షల అప్లికేషన్ల ద్వారా రూ.2,600 కోట్లు వచ్చాయి.
News October 18, 2025
గ్రూప్-2 అభ్యర్థులకు 48hrs ముందే దీపావళి: CM

TG: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని CM రేవంత్ అన్నారు. HYDలో వారికి నియామక పత్రాలను అందజేశారు. ‘₹లక్ష కోట్లతో కట్టిన “కాళేశ్వరం” మూడేళ్లలోనే కూలింది. గత పాలకులు వారి కుటుంబాల కోసమే ఆలోచించారు. పదేళ్లలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. తన ఫామ్హౌస్లో ఎకరా పంటపై ₹కోటి ఆదాయం వస్తుందన్న పెద్దాయన.. ఆ విద్యను ప్రజలకు ఎందుకివ్వలేదు’ అని ప్రశ్నించారు.