News December 6, 2024
MSPతోనే పంటల కొనుగోలు: కేంద్రం

వ్యవసాయ ఉత్పత్తులను MSPతో కొనేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో తెలిపారు. 2019 నుంచి పంట ఉత్పత్తుల ఖర్చులో 50% రైతులకు లాభం చేకూర్చేలా MSPని లెక్కిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ అవసరం లేకుండా రైతుల ఆదాయం పెంపు, నష్టాల సమయంలో పరిహారం వంటి చర్యలతో ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే రైతులు MSPకి చట్టబద్ధత డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News March 3, 2026
వీధి కుక్కలతోనూ బ్రాండ్ మార్కెటింగ్!

యాడ్స్ కోసం సంస్థలు హోర్డింగ్లు, కటౌట్లపై ఖర్చు చేసే బదులు సింపుల్గా వీధి కుక్కలను వాడుకుంటే ఎలా ఉంటుంది? ఆదిత్య అనే ఓ మాజీ మైక్రోసాఫ్ట్ టెకీకి వచ్చిన ఐడియా ఇది. ‘Stray as a Service’ అనే పేరుతో ఏఐ ఫొటోస్ కూడా షేర్ చేశారు. దేశంలో దాదాపు 3 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని వీటిని యాడ్స్కు వాడుకుంటే ఖర్చు తగ్గి, అవి తిరిగేచోటల్లా బ్రాండ్ ప్రమోట్ అవుతుందన్నారు. మరి ఈ ఐడియా ఎలా ఉంది? కామెంట్ చేయండి.
News March 3, 2026
హార్ముజ్ బంద్.. భారత్కు నిలిచిన క్రూడాయిల్

ఇరాన్పై దాడుల ఎఫెక్ట్తో ‘హార్ముజ్ జలసంధి’ వద్ద షిప్పుల మూవ్మెంట్ ఆగిపోయింది. దీనివల్ల భారత్కు వచ్చే చమురు దిగుమతులు దారుణంగా పడిపోయాయి. Febలో రోజుకు 28 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ ఈ మార్గం ద్వారా భారత్కు వచ్చింది. మార్చి 1 నాటికి అది ‘సున్నా’కు పడిపోయింది. మన దేశానికి కావాల్సిన 50% చమురు, దాదాపు 100% LPG ఈ రూట్ నుంచే వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% ఇక్కడి నుంచే వెళ్తుంది.
News March 3, 2026
ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

☛ పత్తి, వేరుశనగ చుట్టూ ఆముదపు పంటను ఎర పంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను నివారించవచ్చు. ☛ క్యాబేజీలో ఆవాల పంటను వేసి డైమండ్ బ్యాక్ మాత్ను నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ అలసందలు పంటలో ఆవాలును ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు మొక్కలను నాటి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.


