News July 14, 2024

నేడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం

image

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రత్నభాండాగారాన్ని 46ఏళ్ల తర్వాత ఇవాళ తెరవనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్‌రథ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంత మంది పాల్గొంటారు? ఎన్ని రోజులు పడుతుంది? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈనెల 19 వరకు దేవతా మూర్తులు ఆలయం బయటే ఉండనున్నాయి. ఈ కారణంగానే లెక్కింపు వివరాల్ని వెల్లడించనట్లు తెలుస్తోంది.

Similar News

News March 8, 2025

బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్.. ముగ్గురు అరెస్ట్

image

AP: గుంటూరు ANUలో బీఎడ్ ప్రశ్నాపత్రం <<15680685>>లీకేజీ<<>> ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు ఒడిశాకు చెందిన ఏజెంట్లని, ఆ రాష్ట్ర విద్యార్థులకు ఏపీలోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తుంటారని తెలిపారు. అలాగే పాస్ చేయించేందుకు క్వశ్చన్ పేపర్లను లీక్ చేస్తుంటారని గుర్తించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.

News March 8, 2025

‘ఛావా’కు తొలి రోజు రూ.3 కోట్లు!

image

బాలీవుడ్‌‌లో దాదాపు రూ.480 కోట్లు కలెక్ట్ చేసిన ‘ఛావా’ మూవీ నిన్న తెలుగులో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ వస్తోంది. డబ్బింగ్ ఏమాత్రం బాగాలేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు డైలాగులపై ఫోకస్ చేయాల్సిందంటున్నారు. గీతా ఆర్ట్స్ పెద్ద ఎత్తున విడుదల చేసినా తొలి రోజు కేవలం రూ.3కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

News March 8, 2025

దారుణం: మహిళా టీచర్ల ఫొటోలను తీసి..

image

TG: విద్యాబుద్ధులు నేర్పే మహిళా టీచర్ల పట్ల కొందరు విద్యార్థులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్(D) తొర్రూరులోని ZP హైస్కూల్‌లో పాఠాలు చెబుతున్న సమయంలో వెనుక నుంచి ఫొటోలు తీశారు. బెంచ్‌లో కూర్చుని ప్రశ్నలకు సమాధానాలిస్తుండగా అసభ్యకరంగా ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పోస్టు చేసినట్లు సమాచారం. ఓ విద్యార్థిని గమనించి HMకు ఫిర్యాదు చేయగా, విషయం బయటికి రాకుండా చూసినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!