News July 14, 2024
పూరీ రత్నభాండాగారం విశేషాలివే..

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ సమీపంలో రత్నభాండాగారం చిన్న ఆలయ తరహాలో ఉంటుంది. ఇందులో ఆభరణాలను భద్రపరిచేందుకు బహరా భాండార్(బయట గది), భితరా భాండార్(లోపలి గది) అనే రెండు గదులు ఉంటాయి. స్వామివారికి ఉపయోగించే ఆభరణాలు బయట గదిలో, ఒడిశాను పాలించిన రాజులు, నేపాల్ పాలకులు ఈ ఆలయానికి విరాళంగా అందజేసిన బంగారు, వెండి, వజ్రాలను లోపలి గదిలో భద్రపరిచారు.
Similar News
News February 9, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్లో 47 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 47 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. గ్రాడ్యుయేట్(బీఈ, బీటెక్), డిప్లొమా అర్హత గల వారు NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ట్రైనీలకు ఫిబ్రవరి 10న, డిప్లొమా ట్రైనీలకు ఫిబ్రవరి 11న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా ట్రైనీలకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nal.res.in/
News February 9, 2026
ముగ్గురు సిస్టర్స్ సూసైడ్.. BIG TWIST

ఘజియాబాద్లో ముగ్గురు సిస్టర్స్ <<19060937>>సూసైడ్<<>> కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల విచారణలో తండ్రి చేతన్ పొంతనలేని సమాధానాలిచ్చాడు. అతనికి ముగ్గురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారనే విషయం వెలుగులోకొచ్చింది. వీరంతా ఒకే రూములో నిద్రించేవారు. మరి ఆ ముగ్గురు బయటికెళ్తుంటే చూడలేదా అనే ప్రశ్నకు ‘ఇది వారి డైలీ రొటీన్లో భాగం’ అని తండ్రి చెప్పడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
News February 9, 2026
లోక్సభ రేపటికి వాయిదా

విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఇవాళ ఉదయం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. ఈక్రమంలోనే LoP రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనా విపక్షాలు ఆందోళన చేపట్టడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


