News November 1, 2024

రిటెన్షన్ల అనంతరం IPL జట్ల పర్స్ వాల్యూ..

image

➣సీఎస్కే – రూ. 55 కోట్లు ➣MI – రూ. 45 కోట్లు ➣కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 51 కోట్లు ➣RR – రూ. 41 కోట్లు ➣పంజాబ్ కింగ్స్ – రూ. 110.5 కోట్లు ➣లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 69 కోట్లు ➣SRH – రూ. 45 కోట్లు ➣GT – రూ. 69 కోట్లు ➣RCB – రూ. 83 కోట్లు ➣DC – రూ. 73 కోట్లు
➥➥KKR, RR ఆరుగురిని రిటైన్ చేసుకోగా పంజాబ్ ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లనే అట్టిపెట్టుకుని అత్యధిక పర్స్ వాల్యూ కలిగి ఉంది.

Similar News

News January 22, 2026

భోజ్‌శాలలో సరస్వతీ పూజ, నమాజ్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

image

ధార్‌(MP)లోని వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్‌లో రేపు (జనవరి 23) వసంత పంచమి సరస్వతీ పూజ, నమాజ్ రెండూ జరుపుకొనేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది. హిందువులు రోజంతా పూజలు నిర్వహించుకోవడానికి అనుమతించింది. ఇద్దరికీ వేర్వేరు దారులు ఉండేలా చూడాలని, ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించింది.

News January 22, 2026

అక్రమ సంబంధాలు.. కుటుంబాలు నాశనం!

image

కొందరు మహిళలు అక్రమ సంబంధాలకు అలవాటుపడి పచ్చని కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. HYD కూకట్‌పల్లిలో ప్రసన్న భర్త మెడకు చున్నీ బిగించి చంపేయగా, గుంటూరు(D) చిలువూరులో భార్య లక్ష్మి భర్తను ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అటు భార్యలపై అనుమానాలతో భర్తలు వారిని చంపుతున్న ఘటనలూ పెరిగిపోయాయి. HYD రహ్మత్‌నగర్‌లో భర్త ఆంజనేయులు భార్య సరస్వతిని, అనంతపురంలో వీరాంజనేయులు తన భార్య లక్ష్మిని చంపేశారు.

News January 22, 2026

నైనీ కోల్ బ్లాక్ అంశం.. కేంద్ర బృందం విచారణ

image

TG: రాష్ట్రంలో సంచలనంగా మారిన నైనీ కోల్ బ్లాక్ అంశంపై కేంద్రం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర బృందం విచారణ జరపనుంది. ఇద్దరు సభ్యుల బృందం త్వరలోనే సింగరేణిలో పర్యటించనుంది. ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారణ చేపట్టనుంది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అంశంలో ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.