News December 1, 2024

‘పుష్ప-2’: ఒక్క టికెట్ రూ.1,200.. కరెక్టేనా?

image

‘పుష్ప-2’ ప్రీమియర్ టికెట్ ధరలను రూ.800 పెంచడంతో మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ రూ.1,200, సింగిల్ స్క్రీన్లో రూ.1,000 అవుతోంది. ఒక్క షోకు ఇంత రేటా? అని ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అభిమానులు మాత్రమే ప్రీమియర్స్ చూస్తారని, వాళ్లు యాక్సెప్ట్ చేయడం వల్లే ధరలు పెంచుతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే సంక్రాంతికి సైతం టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News March 25, 2026

అన్ని కాలేజీల్లో ఇక ఫేషియల్ రికగ్నిషన్ హాజరు

image

AP: కాలేజీకి రాకుండానే హాజరును మేనేజ్ చేద్దామనుకుంటే ఇక కుదరదు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు, లెక్చరర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేయాలని GOVT నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌తో పాటు ప్రైవేటు కాలేజీలకూ వచ్చే ఏడాది నుంచి ఇది వర్తించనుంది. రియల్ టైమ్ పర్యవేక్షణతో హాజరు శాతాన్ని పెంచడం ద్వారా ప్రమాణాలు మెరుగుపర్చనుంది. 75% హాజరుంటేనే విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది.

News March 25, 2026

రాహుల్ పర్యటన రద్దు.. కేరళంకు రేవంత్

image

కడుపు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కేరళం టూర్ రద్దయింది. రాహుల్‌కు బదులుగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు TG CM రేవంత్ కేరళంకు బయల్దేరారు.

News March 25, 2026

IPL: కెప్టెన్లంతా ఒకే చోట

image

ఐపీఎల్-2026 సందడి మొదలైంది. లీగ్‌లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లు ముంబైలో ఒకేచోట కలుసుకున్నారు. సీజన్ ప్రారంభానికి ముందు ఏటా జరిగే ‘కెప్టెన్స్ ఫొటోషూట్’లో వీరంతా పాల్గొన్నారు. హార్దిక్ పాండ్య, రుతురాజ్ గైక్వాడ్, రజత్, పంత్‌, కిషన్, రహానే, పరాగ్, అక్షర్, గిల్, శ్రేయస్ కలిసున్న ఫొటోలను IPL పంచుకుంది. ఈ నెల 28 నుంచి ఈ క్రికెట్ పండుగ షురూ కానున్న విషయం తెలిసిందే.