News November 27, 2024
‘పుష్ప-2’ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?

‘పుష్ప-2’ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కోసం అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా, ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 30 లేదా డిసెంబర్ 1న బుకింగ్స్ ఓపెన్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రీ సేల్ ఇప్పటికే యూఎస్లో మొదలైంది. ‘పుష్ప-2’ డిసెంబర్ 5న విడుదల కానుంది.
Similar News
News November 24, 2025
విజేతలుగా కడప జిల్లా టీంలు

పులివెందలలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతే గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.
News November 24, 2025
రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

హైదరాబాద్లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్పై ఈ రైడ్స్ జరిగాయి.
News November 24, 2025
యూకేని వీడనున్న మిట్టల్!

భారత సంతతి వ్యాపారవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ యూకేని వీడనున్నారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరగడం, కుటుంబ వ్యాపారాలపై కొత్త రూల్స్, ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా యూకేలో పన్ను చెల్లించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పన్నులు లేని దుబాయ్లో సెటిల్ కానున్నారు. ఇప్పటికే అక్కడ ఓ ల్యాండ్ కొన్నారు. కాగా మిట్టల్ $21.4 బిలియన్ల సంపదతో ప్రపంచ ధనవంతుల్లో 104వ స్థానంలో ఉన్నారు.


