News December 3, 2024
‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్ చేసిన ‘పుష్ప-2’!

విడుదలకు ముందే ‘పుష్ప-2’ సంచలనాలు నమోదు చేస్తోంది. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచినట్లు సినీవర్గాలు తెలిపాయి. కల్కి, బాహుబలి-2, కేజీఎఫ్-2 రికార్డులను చెరిపేసిందని పేర్కొన్నాయి. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.100 కోట్ల మార్క్ క్రాస్ అయిందని, భారత సినీ చరిత్రలో ఇదే రికార్డు అని ‘పుష్ప’ టీం ట్వీట్ చేసింది.
Similar News
News November 26, 2025
0-5 ఏళ్ల చిన్నారులకు ఆధార్ తప్పనిసరి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్

జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలందరికీ ఆధార్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం ఐడీఓసీలో ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, రెవెన్యూ శాఖల అధికారులకు ఆయన ఈ విషయాన్ని సూచించారు.
News November 26, 2025
2 కోట్ల ఆధార్ ఐడీల తొలగింపు.. కారణమిదే!

దేశవ్యాప్తంగా 2 కోట్ల ఆధార్ ఐడీలను UIDAI డీయాక్టివేట్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డేటా క్లీనింగ్లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిసేబుల్ చేసినట్లు చెప్పింది. ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఇలా చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారత రిజిస్ట్రార్ జనరల్ నుంచి వచ్చిన డెత్ రిజిస్ట్రేషన్లు, ఇతర సమాచారం ఆధారంగా డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.


