News November 7, 2024
రికార్డు సృష్టిస్తోన్న ‘పుష్ప-2’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా విడుదలకు ముందే చరిత్ర సృష్టిస్తోంది. ఓవర్సీస్లో అత్యంత వేగంగా $500K ప్రీమియర్ ప్రీ-సేల్స్ జరిపినట్లు మేకర్స్ ప్రకటించారు. మూవీ విడుదలకు ఇంకా 30 రోజులు ఉన్నప్పటికీ అప్పుడే ఆఫ్ మిలియన్ క్రాస్ చేసిందన్నారు. విడుదల తేదీ నాటికి రికార్డు ప్రీ కలెక్షన్లు సాధిస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Similar News
News December 18, 2025
రోల్ బాల్ WC విజేతలుగా భారత జట్లు

దుబాయ్ వేదికగా జరిగిన రోల్ బాల్ వరల్డ్ కప్లో భారత మెన్స్, ఉమెన్స్ టీమ్స్ అదరగొట్టి ఛాంపియన్లుగా నిలిచాయి. కెన్యా జట్లతో జరిగిన ఫైనల్లో మహిళల జట్టు 3-2 తేడాతో, పురుషుల జట్టు 11-10 తేడాతో విజయం సాధించాయి. కాగా ఇది రోలర్ స్కేట్స్తో ఆడే ఒక గేమ్. బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, త్రోబాల్ కలయికలో ఉంటుంది. ఆటగాళ్లు స్కేట్స్ వేసుకొని బంతిని చేతులతో పాస్ చేసుకుంటూ ప్రత్యర్థి గోల్ పోస్ట్లోకి వేయాలి.
News December 18, 2025
విడాకులు తీసుకున్నట్లు నటుడి ప్రకటన

17 ఏళ్ల వివాహ బంధానికి సీనియర్ నటుడు షిజు ఏఆర్ ముగింపు పలికారు. ‘ప్రీతికి, నాకు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరయ్యాయి. ఇకపై ఇద్దరం స్నేహితులుగా ఉంటాం. మా ప్రైవసీకి భంగం కల్గించొద్దని కోరుతున్నా’ అని సోషల్ మీడియాలో తెలిపారు. మాలీవుడ్ పాపులర్ నటుల్లో ఒకరైన షిజు తెలుగులో ‘దేవి’తో పరిచయమై ‘సింహరాశి, మనసంతా నువ్వే, గౌతమ్ SSC, నువ్వు నాకు నచ్చావ్, శతమానం భవతి, రాబిన్ హుడ్’ తదితర సినిమాల్లో నటించారు.
News December 18, 2025
జోగి రమేశ్కు చుక్కెదురు

AP: నకిలీ మద్యం కేసు నిందితుడు (A18) జోగి రమేష్ బెయిల్ పిటిషన్ను విజయవాడ ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. ఆయనతో పాటు A19 జోగి రాములు, A2జగన్మోహన్ రావులకూ కోర్టు ఈనెల 31 వరకు రిమాండ్ విధించడంతో వారిని పోలీసులు తిరిగి జైలుకు తరలించారు. ఇక ఈ కేసులోని మరో ఏడుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. అటు నెల్లూరు జైలు నుంచి విజయవాడ జైలుకు తరలించాలన్న జోగి బ్రదర్స్ వినతిని న్యాయస్థానం ఆమోదించింది.


