News December 11, 2024
రూ.1,000 కోట్లు దాటేసిన ‘పుష్ప-2’

బాక్సాఫీసుపై అల్లు అర్జున్ ‘పుష్ప-2’ దండయాత్ర కొనసాగుతోంది. ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,002 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. బాక్సాఫీసు వద్ద సరికొత్త చరిత్రను లిఖించిందని పేర్కొంది. దీంతో అత్యంత వేగంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా నిలిచిందని వెల్లడించింది. కమర్షియల్ సినిమాకు దర్శకుడు సుకుమార్ కొత్త అర్థం చెప్పారని పేర్కొంది.
Similar News
News March 7, 2026
ఇరాన్ ఓడిపోయింది.. ఇక బెదిరించలేదు: ట్రంప్

గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ <<19319891>>సారీ చెప్పడంపై<<>> అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. వేల ఏళ్ల చరిత్రలో మిడిల్ ఈస్ట్ దేశాల ముందు ఇరాన్ ఓడిపోవడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇకపై పొరుగు దేశాలను అది బెదిరించలేదని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఇందుకు మధ్యప్రాచ్య దేశాలన్నీ తనకు థాంక్యూ చెప్పాయన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులకు ఇరాన్ తోకముడిచి క్షమాపణ చెప్పిందని ఎద్దేవా చేశారు.
News March 7, 2026
రేపు కెప్టెన్ సూర్య రిటైర్మెంట్?

INDT20 జట్టు కెప్టెన్ సూర్య రేపు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. కివీస్తో జరిగే T20WC ఫైనల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఫామ్ తగ్గడం, వయసు పెరగడం(35 ఏళ్లు), కెరీర్ చివరి దశలో ఉన్నందున రిటైర్మెంట్కు ఇదే మంచి తరుణమని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా SKY కెప్టెన్సీలో IND ఒక్క సిరీసూ ఓడిపోలేదు. అయితే బ్యాటర్గా విఫలమవుతున్నారు.
News March 7, 2026
8 మంది MLAలకు క్లీన్ చిట్

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో తీర్పును ఆయన రిజర్వ్ చేశారు.


