News December 6, 2024

పుష్ప-2 మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

image

‘పుష్ప-2’ సినిమాలోనివి అంటూ ఫేక్ డైలాగ్స్ ప్రచారం చేసే వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని మైత్రీ సంస్థ ప్రకటించింది. ‘ఊహాజనితమైన, సొంత క్రియేటివిటీతో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2లోనివి అంటూ కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పెట్టడం మానేయండి’ అని ట్వీట్ చేసింది. పైరసీపై వాట్సాప్‌లో(8978650014) రిపోర్ట్ చేయాలని కోరింది.

Similar News

News December 8, 2025

భారత్‌లో విమానయాన సంస్థలకు డిమాండ్: రామ్మోహన్ నాయుడు

image

భారత్‌లో విమాన సర్వీసులకు డిమాండ్ పెరుగుతోందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. డిమాండ్‌కు తగినట్టుగా కాంపిటీటర్స్ ఉండాలని, దేశంలో మరో 5 పెద్ద విమాన సంస్థల అవసరం ఉందని చెప్పారు. ఏవియేషన్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. <<18503378>>ఇండిగో సంక్షోభం<<>>పై చర్యలు తీసుకోవడంతోపాటు దానిని ఒక ఉదాహరణగా తీసుకుంటామని చెప్పారు.

News December 8, 2025

డబ్బు విలువ ఎందుకు తగ్గుతుందంటే?

image

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు <<18505684>>విలువ<<>> ఎలా తగ్గుతుందనే డౌట్ చాలామందికి రావొచ్చు. ద్రవ్యోల్బణం అంటే వస్తు, సేవల ధరలు సాధారణంగా పెరగడం. దీని ఫలితంగా డబ్బుకున్న కొనుగోలు శక్తి కాలక్రమేణా తగ్గుతుంది. ఉదా.. 6% ద్రవ్యోల్బణం ఉంటే ఈ రోజు ₹100తో కొన్న వస్తువును భవిష్యత్తులో ₹106 పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే మీ దగ్గరున్న డబ్బుతో గతంలో కొన్నంత ఎక్కువ వస్తువులను ఫ్యూచర్‌లో కొనలేరు. ఇలా డబ్బు విలువ తగ్గుతుంది.

News December 8, 2025

స్కూళ్లకు సెలవులపై ప్రకటన

image

TG: ఈ నెల 11న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్కూళ్లకు రెండు రోజులు సెలవు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే పాఠశాలలకు 10, 11న సెలవు ఉంటుందని పేర్కొన్నారు. 10న పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల దృష్ట్యా, 11న పోలింగ్ ఉండటంతో సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా తొలి విడతలో 4,236 గ్రామాల్లో పోలింగ్ జరగనుండగా ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొననున్నారు.