News August 25, 2025

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్‌కు ఆర్థికసాయం

image

TG: ‘పుష్ప-2’ విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ‘మిషన్ వాత్సల్య పథకం’ కింద బాలుడికి 18 ఏళ్లు వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.4,000 అందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు గడచిన 3 నెలలకుగాను రూ.12వేలు వారి ఖాతాలో జమ చేసింది. కాగా ఈ ఘటనలో బాలుడి తల్లి రేవతి చనిపోగా, గాయపడిన శ్రీతేజ్ ఇంకా కోలుకుంటున్నాడు.

Similar News

News August 25, 2025

వికలాంగుల పెన్షన్లు రద్దు చేయలేదు: మంత్రి పయ్యావుల

image

AP: వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఖండించారు. ‘కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చాం. 40% పైబడి అంగవైకల్యం ఉన్న వారికే పెన్షన్లు ఇస్తాం. నోటీసులు అందుకున్న వారు మెడికల్ బోర్డు దగ్గర తమ వైకల్యం నిరూపించుకోవాలి. మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్లు అందిస్తాం’ అని స్పష్టం చేశారు. అటు SEP 6న అనంతపురంలో CM CBN పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.

News August 25, 2025

ఇన్‌స్టా చూడటమే ఉద్యోగం!

image

కొందరు ఎక్కువసేపు సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారికి ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఒకటుంది. ముంబైకి చెందిన మాంక్ ఎంటర్టైన్మెంట్ ‘డూమ్ స్క్రోలర్’ పేరిట ఉద్యోగ అవకాశాన్ని ఇస్తోంది. సదరు ఉద్యోగి ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కనీసం 6 గంటల సమయం గడుపుతూ ట్రెండింగ్ అంశాలు, వైరల్ కంటెంట్‌ను గుర్తించాలి. వీరికి హిందీ & ఇంగ్లిష్ వచ్చి ఉండాలి.

News August 25, 2025

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

image

AP: వైద్యారోగ్యశాఖలో 185 డాక్టర్ల నియామకానికి ప్రభుత్వం <>నోటిఫికేషన్ <<>>ఇచ్చింది. ఒప్పంద విధానంలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. MBBS అర్హతతో 155 వైద్యుల పోస్టులు, టెలిమెడిసిన్ హబ్‌లో 13 జనరల్ మెడిసిన్ పోస్టులు, గైనకాలజిస్టులు-3, చిన్న పిల్లల వైద్యులు-14 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి SEP 10 వరకు దరఖాస్తు చేయవచ్చు.