News February 8, 2025
ఇవాళ ‘పుష్ప-2’ థాంక్యూ మీట్

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ టాప్ ప్లేస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఇవాళ ‘థాంక్యూ మీట్’ నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
Similar News
News March 21, 2026
7 కేజీల బరువు తగ్గా: శ్రేయస్

గాయం కారణంగా గతేడాది తనకు కష్టంగా గడిచిందని PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. దాదాపు 7KGల బరువు తగ్గినట్లు తెలిపారు. గాయం నుంచి కోలుకొని మళ్లీ బరువు పెరిగి ఫిట్నెస్ సాధించడానికి తీవ్రంగా కష్టపడినట్లు గుర్తు చేసుకున్నారు. తనకు ఛాలెంజెస్ అంటే ఇష్టమన్నారు. ‘2025 IPLలో రన్నరప్గా నిలిచాం. ఈ ఏడాది మా జట్టుపై భారీ అంచనాలున్నాయి. నా కన్ను ట్రోఫీపైనే ఉంది’ అని పేర్కొన్నారు.
News March 21, 2026
ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్పోర్ట్: రామ్మోహన్

దేశంలో ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ అన్నారు. విశాఖలో ఓ ప్రోగ్రామ్లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే IND అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్గా అవతరించిందని చెప్పారు. APలోని, TGలోని పలు కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. NDA అధికారంలోకి వచ్చేనాటికి తక్కువగా ఉన్న ఎయిర్పోర్టుల సంఖ్య 167కి చేరిందని చెప్పారు.
News March 21, 2026
వారి రిటైర్మెంట్ వయసు పెంపు!

AP: ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూళ్ల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(లోకేశ్, పయ్యావుల, నారాయణ) నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే జీవో వెలువడనుంది. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.


